ఒకరు పాన్ ఇండియా హీరో.. మరొకరు పాన్ ఇండియా డైరెక్టర్.. ఇద్దరు కలిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం. ఆ ఇద్దరే డార్లింగ్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక డైరెక్టర్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని గొప్పగా తీర్చిదిద్దుతున్నాడు.
కిరగందూర్ హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ కోసం సలార్ టీం దక్షిణ ఇటాలియన్ పట్టణం మటేరాలో బిజీబిజీగా ఉంది. అయితే 2021 జేమ్స్ బాండ్ చిత్రం ‘నో టైమ్ టు డై’కి సంబంధించిన యాక్షన్ ప్రోలోగ్ని మాటెరాలో చిత్రీకరించారు. అనేక ఇతర అంతర్జాతీయ సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరించబడ్డాయి.
‘సాలార్’ ప్రొడక్షన్ ఇప్పుడు అక్కడే షూటింగ్ జరుపుకుంటోంది. నైట్ షూటింగ్ కోసం డ్రోన్ల వినియోగం, భారీ సెట్స్ అమర్చబడ్డాయి. ఇక యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కబోతున్నాయి. అక్కడి స్థానికులు సలార్ టీమ్ కు సాయం చేస్తుండటం విశేషం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం. ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 28 న అన్ని భాషల్లో విడుదల కానుంది.