హస్యనటులు హీరోలుగా మారి హిట్స్ కొట్టిన సందర్భాలు టాలీవుడ్ లో ఎన్నో ఉన్నాయి. అలీ, సునీల్, వేణుమాధవ్ లాంటి నటులు హీరోలుగా మారి విజయాలు దక్కించుకున్నారు. ఇప్పుడు మరో కమెడియన్ హీరోగా మారబోతున్నాడు. ఆయన్నే ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్. హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. స్పై యాక్షన్ కామెడీలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘చారి 111’ అని పేరు పెట్టారు. సుమంత్తో ‘మళ్లీ మొదలైంది’ చిత్రాన్ని రూపొందించిన టీజీ కీర్తి కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
కిషోర్ రహస్య గూఢచారిగా కనిపిస్తుండగా, మురళీ శర్మ గూఢచారి సంస్థకు నాయకత్వం వహిస్తాడు. ఒక నగరం పెద్ద సమస్యను ఎదుర్కొన్నప్పుడు, గూఢచారి కిషోర్ దానిని ఎలా పరిష్కరిస్తాడు అనేది కథ ముఖ్యాంశం. చాలా ఆసక్తికరంగా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇది మంచి వినోదంతో పాటు యాక్షన్తో అనేక మలుపులు కలిగి ఉంటుంది.
వెన్నెల కిషోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తోంది. బర్కత్ స్టూడియోస్ ప్రొడక్షన్ బ్యానర్పై అదితి సోని ఈ చిత్రాన్ని బ్యాంక్రోల్ చేసింది. వెన్నెల కిషోర్ నటిస్తుండటంతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సైమన్ కె కింగ్ సంగీతం సమకూర్చగా, కాశిష్ గ్రోవర్ సినిమాటోగ్రాఫర్. వెన్నల కిషోర్ మొదటిసారిగా హీరోగా నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
Also Read: Muttiah Muralitharan: శివలెంక కృష్ణప్రసాద్ కు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ హక్కులు