Poonam Pandey: నేను చనిపోలేదు.. పూనమ్ పాండే సంచలన వీడియో..!

బాలీవుడ్ నటి పూనమ్‌ పాండే (Poonam Pandey) తాను చనిపోలేదని వీడియో రిలీజ్ చేశారు. సర్వైకల్ క్యాన్సర్‌పై అవేర్‌నెస్ కోసం ఇలా చేసినట్టు ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
Poonam Pandey

Poonam Pandey Dies

Poonam Pandey: బాలీవుడ్ నటి పూనమ్‌ పాండే (Poonam Pandey) తాను చనిపోలేదని వీడియో రిలీజ్ చేశారు. సర్వైకల్ క్యాన్సర్‌పై అవేర్‌నెస్ కోసం ఇలా చేసినట్టు ప్రకటించింది. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు క్షమించాలని కోరింది. ప్రముఖ మోడల్-నటి పూనమ్ పాండే సజీవంగా ఉందని, ఆమె స్వయంగా సమాచారం ఇచ్చింది. తన మరణ వార్తను నటి స్వయంగా అబద్ధం అని పేర్కొంది. పూనమ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకుంది. అందులో ఆమె జీవించే ఉన్నాన‌ని చెప్పుకొచ్చింది. ఎందుకు ఇలా చేసిందో చెబుతుంది. పూనమ్ స్వయంగా తన మరణ వార్తను ఎందుకు ప్రచారం చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం..?

అవగాహన కోసం ఇలా చేశాం

పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన వీడియోలో ఆమె పూర్తిగా బాగానే ఉంది. ఈ వీడియోలో పూనమ్ తన మరణ వార్త గురించి చెబుతోంది. తప్పుడు మరణ వార్తలపై మాట్లాడుతూ.. సర్వైకల్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఇదంతా చేశామన్నారు. నేను ఇంకా బతికే ఉన్నాను అని పూనమ్ చెప్పింది. నేను చనిపోలేదు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో ప్రాణత్యాగం చేసే మహిళల గురించి నేను చెప్పలేను. దీంతో ఏం చేయాలో తెలియడం లేదని, అందుకే ఏమీ చేయ‌లేక దానిపై అవ‌గాహ‌న కోసం ఇలా చేశాన‌ని పూనమ్ చెప్పింది.

Also Read: Cardamom: ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే యాలకులు తీసుకోవాల్సిందే?

పూనమ్‌ పాండే మరణించినట్లు వస్తున్న వార్తలపై ఆమె ఇలా వివరణ ఇచ్చింది. ‘మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నాను. నేను బతికే ఉన్నాను. గర్భాశయ క్యాన్సర్‌తో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొలేదు. కానీ ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవటం వల్ల వేలాది మంది మహిళల నేడు దేశంలో ప్రాణాలను వదులుతున్నారు. సరైన చికిత్స తీసుకుంటే గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించదగినది. HPV వ్యాక్సిన్‌ను ముందస్తుగా తీసుకుంటే దీనిని ఎదుర్కొనవచ్చు . గర్భాశయ క్యాన్సర్‌ విషయంలో ప్రతి మహిళ తీసుకోవలసిన చర్యల గురించి అందరికీ తెలిసేలా చేద్దాం.’ అని పూనమ్‌ పాండే తెలిపింది.

We’re now on WhatsApp : Click to Join

అయితే శుక్ర‌వారం బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే మరణించిందనే షాకింగ్ న్యూస్ వైరల్ అయిన విష‌యం తెలిసిందే. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పీఆర్‌ టీమ్ ఈ మేర‌కు షేర్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే అది అంతా క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న కోస‌మే అని పూన‌మ్ చెప్ప‌టంతో ఆమె అభిమానులు, బంధువులు, స‌న్నిహితులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

  Last Updated: 03 Feb 2024, 12:56 PM IST