ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. ఫైబ్రో మయాల్జియా అనే ఒక అరుదైన సమస్యతో ఆమె బాధపడుతోందట. ఈ వ్యాధి ఉన్నవారు అలసటకు గురవుతారు. వారి మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. కండరాల నొప్పికి గురవుతారు. నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ప్రస్తుతం పూనమ్ కౌర్ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటోందట. రెండేళ్ల నుంచి ఆమె ఈ వ్యాధితో బాధపడుతోందని సమాచారం. ఎస్వీ కృష్ణారెడ్డి ‘మాయాజాలం’ సినిమాతో ఆమె టాలీవుడ్ కు పరిచయమయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.