రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటిన బుట్టబొమ్మ..!

గ్రీన్ ఇండియా చాలెంజ్... ఎంపీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీ దాకా అన్నివర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

  • Written By:
  • Updated On - November 26, 2021 / 05:50 PM IST

గ్రీన్ ఇండియా చాలెంజ్… ఎంపీ సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీ దాకా అన్నివర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ చాలెంజ్ లో ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ప్రభాస్ వరకు ఈ చాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు.

తాజాగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటింది. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ గ్రీన్ చాలెంజ్ ను ప్రతిఒక్కరూ స్వీకరించాలని కోరింది. అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముక్ కి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” చేస్తున్నట్టు తెలిపారు.

బాలీవుడ్‌ మెగా స్టార్‌ అమితాబ్‌ నటిస్తోన్న ఓ చిత్రంలో పూజా చాన్స్‌ కొట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా పూజానే అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే లొకేషన్‌ స్పాట్‌కు సంబంధించిన ఓ ఫోటోను పోస్ట్‌ చేస్తూ.. ‘లెజెండ్‌ హీరో అమితాబ్‌తో కలిసి నటించడం అనేది నా కల. చివరిగా ఆ కలను సాకారం చేసుకున్నాను.