పూజా హెగ్డే తన కల నిజం చేసుకుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డ్రీమ్హౌస్లోకి వెళ్లబోతున్నట్టు ప్రటించింది. ముంబైలో తాను వెళ్లబోతున్న ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన వీడియోను తన Twitter లో పోస్ట్ చేసింది
పూజా హెగ్డే తన తల్లి మరియు నిర్మాణంలో ఉన్న ఇంటి ఫోటోను పంచుకుంది.
Building my dreams ❤️ #home #supermom #mykindalovestory pic.twitter.com/7h4tb0MwZb
— Pooja Hegde (@hegdepooja) October 27, 2021
“బిల్డింగ్ మై డ్రీమ్స్ #హోమ్ #సూపర్మామ్,” ఆమె తన పోస్ట్ కింద రాసింది.
కోట్ల రూపాయలతో తన డ్రీమ్హోమ్ని పూజ కట్టుకుంటున్నట్టు సమాచారం. అత్యంత ఆధునిక సౌకర్యాలు, హంగులతో దీన్ని నిర్మిస్తున్నారు.
ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తోంది. పూజా హెగ్డే రెమ్యూనరేషన్ దాదాపు రూ. 3 కోట్లు అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి ఆమె. పూజా కిట్టిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.