Pooja Hegde: బాబోయ్.. పూజా హెగ్డేపై షాకింగ్ రూముర్స్.. డబ్బులిచ్చి అవార్డులు తెచ్చుకుంది అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం పూజ

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 08:38 PM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం పూజ హెగ్డే వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా పూజ హెగ్డే పాన్ ఇండియా సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిన విషయం తెలిసింద. ఈ నేపథ్యంలోని తాజాగా ఈమెకు సైమా అవార్డ్స్ లో బెస్ట్ హీరోయిన్ గా కూడా అవార్డు లభించింది. కాగా పూజ హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా గాను ఈమె ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అఖిల్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

పూజా హెగ్డే ఎక్కువ సైమా అవార్డ్ లభించిన విషయం పై నెటిజన్స్ ఆమెను దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఆ అవార్డును పూజ హెగ్డే డబ్బులు పెట్టి మరీ తెచ్చుకుంది అంటూ ఆమె పై చేయడం మొదలుపెట్టారు. అయితే అలా ట్రోలింగ్స్ చేయడం వెనుక బలమైన కారణాలు కూడా వినిపిస్తున్నాయి. అదేమిటంటే బెస్ట్ హీరోయిన్ నామినేషన్స్ లో పూజతో పాటుగా హీరోయిన్ సాయి పల్లవి కూడా ఉంది. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలకు గాను బెస్ట్ హీరోయిన్ గా సాయి పల్లవి నామినేట్ అయ్యింది.

కాగా ఈ రెండు సినిమాలలో సాయి పల్లవి ఎంత అద్భుతంగా నటించిందో మనందరికీ తెలిసిందే. అంతటి మంచి నటనలను కనబరిచిన సాయి పల్లవిని వదిలేసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్గా నటించిన పూజా కూడా ఎలా అవార్డు ఇస్తారు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించడానికి కూడా పెద్దగా ఏమీ లేదు అందులో పూజ నార్మల్ అమ్మాయి క్యారెక్టర్ లో నటించింది అంటూ నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే పూజా హెగ్డే కావాలని ఈ అవార్డును సాయి పల్లకి రానివ్వకుండా చేశారని ఇందుకోసం పూజా హెగ్డే డబ్బులు ఇచ్చి మరి ఆ అవార్డు తెచ్చుకుంది అంటూ నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. మరి ఈ వార్తలపై పూజా హెగ్డే ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.