Pooja Hegde: ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూజా హెగ్డే ఫోటోలు వైరల్..!!

ఆచార్య..అందరి చూపులు ఈ మూవీపైనే ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - April 24, 2022 / 08:24 PM IST

ఆచార్య..అందరి చూపులు ఈ మూవీపైనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ తండ్రీకొడుకులు ఇంతకుముందు కూడా ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ రోల్స్ చేశారు. కానీ ఈ సారి మాత్రం అది పూర్తిస్థాయి పాత్రలతో మెగా ఫ్యాన్స్ ను అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ మూవీ ఏప్రిల్ 29న గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈనేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టిన ఆచార్య మూవీ టీమ్…శనివారం హైదరాబాద్ యూసుఫ్ గూడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి గెస్టుగా హాజరై సినిమాపై మరింత బజ్ ఏర్పడేలా చేశారు. ఈ ఈవెంట్ కు చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, ఉపాసన హాజరయ్యారు. చిరంజీవి, రాంచరణ్ బ్లాక్ కలర్ డ్రెస్సుల్లో రాగా…పూజా హెగ్డే ఎల్లో శారీలో కనువిందు చేసింది. తీరైన కట్టూబొట్టుతో ఆరడుగుల అందగత్తె అద్భుతంగా కనిపించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.