Viral Pics : ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు.. భర్తతో శ్రియ లిప్ లాక్!

దీపావళి సెలబ్రేషన్స్ లో హీరోయిన్ శ్రియా శరణ్, ఆమె భర్త ఆండ్రీ కొస్చీవ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ వేడుకల్లో ఇద్దరు లిప్ లాక్ చేసి డ్యాన్స్ వేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

  • Written By:
  • Updated On - November 3, 2021 / 04:24 PM IST

దీపావళి సెలబ్రేషన్స్ లో హీరోయిన్ శ్రియా శరణ్, ఆమె భర్త ఆండ్రీ కొస్చీవ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ వేడుకల్లో ఇద్దరు లిప్ లాక్ చేసి డ్యాన్స్ వేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ జంట ఎలాంటి వేడుకైనా వారి ఆనందం, ప్రేమను పంచుకోవడానికి ఎక్కడా సిగ్గుపడరు. పబ్లిక్ ప్లేస్ అయినా, ప్రవేట్ ప్లేస్ అయిన సరే వీరిద్దరి మద్య జరిగే రొమాంటిక్ పిక్చర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చుట్టూ వందల మంది ఉన్నా, ఇద్దరే ఏకాంతంగా ఉన్నా కూడా ఒకేలా సరసాలు ఆడేట్టు కనిపిసిస్తున్నారు.

ఈ ఇద్దరి రొమాంటిక్స్ పిక్స్ , వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.ఇంతకు ముందు ఎప్పుడూ ఏ వేడుకకు శ్రియా శరణ్ భర్త రాలేదు.కానీ మొదటి సారి ఇటీవల జరిగిన జీ తెలుగు ఈవెంట్లో ఈ జంట కనిపించింది. అక్కడ కూడా స్టేజ్ మీదే అందరి ముందు రొమాంటిక్ సీన్స్ తో అశ్చర్యపరిచారు.

తాజగా జరిగిన దీపావళి వేడుకల్లో కూడా ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. దీపావళి పార్టీలో తన భర్తతో ముద్దు పెట్టుకున్న ఫోటోను శ్రియా శరణ్ తన ఇన్స్టాగ్రామ్ లో వరుస ఫోటోలను షేర్ చేసింది. సంప్రదాయ దుస్తుల్లో శ్రియ పసుపు రంగు చీరను ధరించగా, ఆండ్రీ వాజ్ కోట్ ధరించారు. శ్రియా శరణ్, ఆండ్రీ కిస్చివ్ లు 2018 లో రహాస్యంగా వివాహం చేసుకున్నారు.ఈ జంటకు 2020 కరోనా సమయంలో పాప జన్మించింది.పాప పుట్టిన విషయాన్ని శ్రియా శరణ్ గోప్యంగా ఉంచగా గత నెలలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కోసం నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ షో తెలుగు 5 లో శ్రియా శరణ్ ప్రత్యేక అతిథిగా కనిపించింది. ఆమె రెండు తమిళ చిత్రాలు నటించగా…అవి విడుదల కావాల్సిఉంది.