Pawan Kalyan : తండ్రి కూతుళ్లు ఇద్దరికీ ఇద్దరు సరిపోయారు.. హిందీ పాటని పాడుతూ..

మొన్న కూతురు ఆద్య పాడిన హిందీ పాటని, నేడు పవన్ కళ్యాణ్ పాడి అందరికి వినిపించారు. తండ్రి కూతుళ్లు ఇద్దరికీ ఇద్దరు సరిపోయారుగా.

  • Written By:
  • Publish Date - May 2, 2024 / 12:18 PM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన ప్రచారాలతో ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల్లో సందడి చేస్తున్నారు. పవన్ చేసే ఈ పొలిటికల్ కాంపెయిన్స్ సోషల్ మీడియాలో నేషనల్ లెవెల్ లో వైరల్ అవుతుండడంతో.. పలు ప్రముఖ నేషనల్ మీడియాలు పవన్ తో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఓ ప్రముఖ నేషనల్ ఛానల్ పవన్ కళ్యాణ్ తో రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ గురించి ఆడియన్స్ కి తెలియని ఓ విషయాన్ని చెప్పామన్నారు.

దీనికి పవన్ బదులిస్తూ.. “నేను అమితాబ్ బచ్చన్ కి చాలా పెద్ద అభిమానాన్ని” అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత మీరు సరదాగా హమ్ చేసే పాట ఏంటి..? అని ప్రశ్నించారు. దానికి పవన్ బదులిస్తూ.. ‘ఏ రాతే ఏ మౌసమ్’ అనే హిందీ సూపర్ హిట్ పాటని పాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇది విన్న పవన్ అభిమానులకు.. ఈ పాటని మెగా ఫ్యామిలీలోని మరెవరో నోటి నుంచి విన్నట్లు గుర్తుకు వచ్చింది.

దీంతో నెట్టింట తెగ వెతికేసారు. ఫైనల్లీ ఆ పాటని గతంలో ఎవరో పాడారో కనిపెట్టసారు. గతంలో ఆ పాటని పడింది మరెవరో కాదు.. పవన్ వారసురాలు ‘ఆద్య’నే. ఓ తెలుగు టీవీ షోలో తల్లి రేణూదేశాయ్ తో కలిసి ఆద్య పాల్గొన్నారు. ఆ షోలో ఆద్యని తన ఫేవరెట్ సాంగ్ ని పడమనగా.. ఇప్పుడు పవన్ పాడిన పాటనే పడింది. దీంతో ఈ రెండు వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ.. ఆద్యకి పవనే ఆ పాటని నేర్పించినట్లు ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి తండ్రి కూతుళ్లు పాడిన ఆ పాటని మీరు కూడా వినేయండి.

Also read : Krish Jagarlamudi : మొన్న కంగనా.. నేడు పవన్ సినిమా.. మధ్యలోనే వదిలేస్తున్న దర్శకుడు..