అసలు నిజం.. వాళ్లకు మాత్రమే తెలుసు..!

టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ అయిన నాగచైతన్య, సమంతలు తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించి మూడు రోజులు గడుస్తున్నా.. వాళ్లిద్దరు ఎందుకు విడిపోయారు? విడిపొవడానికి కారణాలు ఏంటి? అనే విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 11:50 AM IST

టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ అయిన నాగచైతన్య, సమంతలు తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించి మూడు రోజులు గడుస్తున్నా.. వాళ్లిద్దరు ఎందుకు విడిపోయారు? విడిపొవడానికి కారణాలు ఏంటి? అనే విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చైసామ్ వ్యవహరంలో టాలీవుడ్ సెలబ్రిటీలు, నటులు సైతం రకరకాల కామెంట్స్ చేశారు.

అక్టోబర్ 2న తన భర్త నాగ చైతన్య నుంచి విడిపోతున్నట్లు సమంత ప్రకటించింది. ‘‘ఎన్నో ఆలోచనలు, సంప్రదింపులు తర్వాత తాము భార్యాభర్తలుగా ఉండలేమని నిర్ణయించుకున్నాం. ఇక నుంచి ఎవరి సొంతమార్గాల్లో వాళ్లు నడుచుకోవాలనుకున్నాం. పదేళ్లకుపై మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది. భార్యాభర్తలుగా విడిపోయినా, మా మధ్య ప్రత్యేక బంధం ఉంటుందని మా నమ్మకం’’ అని తెలిపింది. నాగచైతన్య కూడా ఇదే విషయమై స్పష్టం చేశారు కూడా.  సమంత మామ నాగార్జున స్పందిస్తూ… ‘‘చై, సామ్ మధ్య ఏమి జరిగినా అది చాలా దురదృష్టకరం. భార్యాభర్తల మధ్య జరిగేది చాలా వ్యక్తిగతమైనది. చైతన్య, సమంత ఇద్దరూ నాకు ప్రియమైనవారే. సమంత మా కుటుంబంతో గడిచిన క్షణాలు మరిచిపోలేనివి’’ అని అన్నారు.

అయితే సమంత విడిపోవాలనే నిర్ణయం కొన్ని నెలల క్రితం తీసుకుందట. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో నటించింది. అప్పట్నుంచే తాను తన మార్గంలో వెళ్లాలనుకుంది. సమంత తన కెరీర్ కోసమే చైతూను పెళ్లిచేసుకోవాలనుకోలేదు. చైతూతో డేటింగ్ ప్రారంభించినప్పుడే టాలీవుడ్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఏమాయ చేసావే సినిమా చేసినప్పటి నుంచే ఇద్దరు దగ్గరయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి.. పెళ్లికి దారితీసింది. అయితే చైతూ, సమంత విడాకుల వ్యవహరంపై సమంత తండ్రి జోసెఫ్ స్పందిస్తూ.. చైసామ్ ఎందుకు విడిపోయారో ఎవరికీ తెలియదు. చివరకు తల్లిదండ్రులు అయినా మాకు కూడా. విడిపోవడానికి కారణాలు వాళ్లద్దరికి మాత్రమే తెలుసునని అన్నారు.