Dragon యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొన్ని నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్ శివార్లలో తిరిగి ప్రారంభమైంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రతిష్ఠాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పుకార్లకు చెక్ పెడుతూ యూనిట్ మళ్లీ యాక్షన్లోకి రావడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. త్వరలో విదేశాల్లో కీలక షెడ్యూల్ కూడా ఉండనున్నట్లు సమాచారం.
కేజీఎఫ్ సిరీస్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడిక్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘ డ్రాగన్ ’ వర్కింగ్ టైటిల్ ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత భారీ అంచనాలు ఉన్న ప్రాజెక్ట్గా నిలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే గుర్తుండిపోయే సినిమాగా ఈ చిత్రం నిలుస్తుందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పిస్తోంది. హీరోయిన్గా రుక్మిణీ వసంత్ నటిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను భువన గౌడ నిర్వర్తిస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డ్రామా ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి.
ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి షూటింగ్ అప్డేట్స్ విషయంలో కొంత నిశ్శబ్దం నెలకొనడంతో అభిమానుల్లో అనేక సందేహాలు తలెత్తాయి. ఒక దశలో ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయిందన్న ప్రచారం కూడా బలంగా వినిపించింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్పై ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడని, ఇద్దరి మధ్య విభేదాల వల్లే షూటింగ్ నిలిచిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్ మరో ప్రాజెక్ట్ ‘దేవర 2’పై కూడా ఇలాంటి కథనాలు రావడంతో అభిమానులు మరింత ఆందోళనకు గురయ్యారు.
అయితే ఆ పుకార్లన్నింటికీ చెక్ పెడుతూ, ‘డ్రాగన్’ యూనిట్ ఇటీవలే మళ్లీ షూటింగ్ ప్రారంభించింది. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ను మొదలుపెట్టిన చిత్ర బృందం కీలక యాక్షన్ ఘట్టాలను అక్కడ చిత్రీకరించింది. ఈ షెడ్యూల్లో ప్రధానంగా నైట్ షూట్స్, భారీ ఫైట్ సీక్వెన్స్లు తెరకెక్కించగా, ఎన్టీఆర్తో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంది. రుక్మిణీ వసంత్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ కావడంతో షూటింగ్ వేగం పుంజుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని షెడ్యూల్ పూర్తైన అనంతరం ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో మరో కీలక యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ స్టైల్కు తగ్గట్టుగా ఈ ఫైట్స్ను చాలా రా అండ్ రియలిస్టిక్గా తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక విదేశాల్లో కీలక భాగాల షూటింగ్కు ప్లాన్ చేస్తున్నారట. అందుకోసమే ఇటీవల సినిమాటోగ్రాఫర్ భువన గౌడ జోర్డాన్ వెళ్లి అక్కడి లొకేషన్లను ఫైనలైజ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఇక కథ విషయానికి వస్తే, 1969 కాలంలో చైనా, భూటాన్, భారతదేశ సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. దేశభక్తి, రాజకీయ ఉద్రిక్తతలతో పాటు తల్లి సెంటిమెంట్ ఈ చిత్రంలో కీలకంగా ఉంటుందట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తల్లి పాత్రలో సీనియర్ బాలీవుడ్ నటి కాజోల్ నటిస్తున్నట్లు సమాచారం. ఆమె పాత్ర సినిమాకు భావోద్వేగ బలంగా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా ఈ పాత్ర కోసం ప్రశాంత్ నీల్ చాలా కేర్ తీసుకున్నారని టాక్. మొత్తంగా, అన్ని అడ్డంకులను దాటుకుని ‘డ్రాగన్’ మళ్లీ ట్రాక్లోకి రావడంతో, ఈ ఏడాదిలోనే ఎన్టీఆర్ అభిమానులకు భారీ పండుగ ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
