NTR 30: ఎన్టీఆర్ 30 షురూ.. జాన్వీ, ఎన్టీఆర్ ఫొటో వైరల్!

నేడు పూజా కార్యక్రమాలతో ఎన్టీఆర్ 30 లాంఛనంగా ప్రారంభం అయ్యింది.

  • Written By:
  • Publish Date - March 23, 2023 / 12:03 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులు ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న క్షణాలు వచ్చాయి. ఆయన కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, జాన్వీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ జాన్వీని ప్రేమగా పలుకరిస్తూ చేతిలో చేయి వేసి అప్యాయంగా మాట్లాడారు. ఈ క్రేజీ ప్రాజెక్టును దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. దీనితో ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ హైప్ స్టార్ట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ మూవీతో నార్త్ ఆడియెన్స్ అటెన్షన్ ని కూడా తారక్ అందుకోగా అక్కడ నుంచి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా ఇది నిలువబోతోంది.

ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ అలాగే తారక్ ముందు సినిమా చేసిన తన జక్కన్న రాజమౌళి నెక్స్ట్ కొరటాల తర్వాత చేయనున్న సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తదితరులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ లాంచ్ లో కొరటాల ఎలాంటి సెన్సిటివ్ అంశాలకు దారి తీయలేదు కానీ సినిమాపై మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడిన మాటలు తారక్ ఫ్యాన్స్ కి మరింత నమ్మకాన్ని కలిగించాయి.

ఈ సినిమా లైన్ కోసం ఇంట్రస్టింగ్ డీటెయిల్స్ ఇస్తూ ఓ రేంజ్ లో ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఉంటుంది అని తెలిపారు. ఇక మరో పక్క అయితే ఈ చిత్రం తన కెరీర్ లోనే బెస్ట్ వర్క్ గా నిలుస్తుంది అని అలాగే తాను ఈ సినిమాకి బెస్ట్ టీం తో వర్క్ చేస్తున్నానని కొరటాల తెలిపారు. దీనితో తన స్పీచ్ తో మాత్రం ఇప్పుడు అందరిలో మరింత ఆసక్తి నెలకొంది.