Niharika Konidela Green Challenge: గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన నిహారిక కొణిదెల!

ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో నిహారిక కొణిదల మొక్కలు నాటారు.

  • Written By:
  • Updated On - October 3, 2022 / 02:35 PM IST

ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో నిహారిక కొణిదెల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. మా నాన్న నాగబాబు గారు ఎప్పుడు ప్రకృతిని ప్రేమించాలని మొక్కలు పెంచాలని చెబుతూ ఉంటారని, ఈ ప్రపంచంలో అందరిని కాపాడే మొదటి దేవుడు ప్రకృతి అని, ఆ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిరంతరం కొనసాగడం చూస్తూ ఉన్నానని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ వారితో మొక్కలు నాటించడం మంచి కార్యక్రమం నిహారిక అన్నారు. ప్రతీ ఒక్కరు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు గ్రీన్ ఛాలెంజ్ లో భాగమవుతున్నారు.