మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సర్కారు వారి పాట’లో ‘మురారి బావ’ అనే కొత్త పాట ఈ వీకెండ్స్ లో రిలీజ్ కానుంది. ఈ రొమాంటిక్, మాస్ సాంగ్లో మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించారు. మే 12 విడుదలైన సినిమాలో ఈ పాట ప్రదర్శించబడలేదు. అయితే రెస్పాన్స్ కలెక్షన్ల ఆధారంగా ఈ వీకెండ్స్ లో పాటను రిలీజ్ చేయాలని సర్కారు వారి పాట నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు అభిమానులను అలరించి ట్రెండింగ్ లో నిలిచాయి. కొత్త పాటకు సంబంధించి సెన్సార్షిప్ పూర్తయింది. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సక్సెస్తో ‘సర్కారు వారి పాట’ టీమ్ జోరు మీదుంది. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది.