Nayanthara: ఫోన్ పగిలిపోద్ది.. అభిమానికి నయన్ తార మాస్ వార్నింగ్!

తమ అభిమాన హీరోనో, హీరోయిన్ కనిపిస్తే అభిమానులు వెంట పడటం, సెల్ఫీలు తీసుకోవడం కామన్ గా మారింది.

  • Written By:
  • Updated On - April 10, 2023 / 03:23 PM IST

స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు సహజంగా ఫాలోయింగ్ ఉంటుంది. తమ అభిమాన హీరోనో, హీరోయిన్ కనిపిస్తే అభిమానులు వెంట పడటం, సెల్ఫీలు తీసుకోవడం కామన్ గా మారింది. అయితే ఒక్కొసారి అభిమానుల ప్రవర్తన నటీనటులకు విసుగు తెప్పిస్తుంది కూడా. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ్ బ్యూటీ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ఓ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. పూజల అనంతరం భర్తతో కలిసి నయనతార బయటకొచ్చింది. అభిమానులు చుట్టిముట్టి ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఓ వ్యక్తి వీడియో తీయడాన్ని గమనించిన నయనతార వెంటనే అతనికి మాస్ వార్నింగ్ ఇచ్చింది. వీడియో తీస్త ఫోన్ పగులకొడుతానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం నయన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కుంభకోణం ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత, ఈ జంట పూర్వీకుల ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఈ జంట పూజ చేయడానికి రావడంతో, నయనతారను త్వరగా చూసేందుకు అభిమానులు గుమిగూడారు. ఓ వ్యక్తి వీడియో తీయడంతో నయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నయనతార తెలుపు, నీలం రంగు దుస్తుల్లో కనిపించగా, నీలిరంగు టీ షర్ట్, ఖాకీ ప్యాంట్, తెల్లటి జాకెట్‌లో కనిపించారు. ప్రస్తుతం నయన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.