ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో నయనతార హీరోయిన్గా మెయిన్ పాత్రలో నటించిన చిత్రం మూకుత్తి అమ్మన్. ఈ సినిమా తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి విజయం సాధించింది. ఇందులో నయనతార అమ్మవారి పాత్రలో నటించింది. సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పార్ట్ 2 తీయాలని ఐసరి గణేష్ ఫిక్స్ అయ్యారు. మూకుత్తి అమ్మన్ 2 బాధ్యతల్ని డైరెక్టర్ సుందర్ సికి అప్పగించారు.
కాగా అమ్మోరు తల్లి 2 సినిమా దాదాపుగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో రెడీ అవుతోందట. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇందుకోసం ఒక చిన్న గుడి లాంటి సెట్ కూడా వేశారు. పూజా కార్యక్రమానికి డైరెక్టర్ సుందర్ సి, ప్రొడ్యూసర్ ఐసరి గణేష్ చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. హీరోయిన్ నయనతార లేటుగా వచ్చినా మాస్గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా మొదలైన సందర్భంగా ఈ ఈవెంట్ లో సుందర్ సి మాట్లాడుతూ సినిమాలో నటించే మిగతా నటీనటుల్ని స్టేజ్ పై పరిచయం చేశారు.
రెజీనా కసెండ్రా, ఇనియా, యోగిబాబు, సింగం పులి, విచ్చు విశ్వనాథ్ లాంటి పెద్ద స్టార్ కాస్ట్ సినిమాలో ఉన్నారని సుందర్ సి తెలిపారు. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నారని తెలిపారు. ముందుగా ఈ విలన్ పాత్రలో అరుణ్ విజయ్ నటిస్తారని అనుకున్నారు. కానీ శాలరీ విషయంలో సెట్ కాకపోవడంతో దునియా విజయ్ ని తీసుకున్నారట. అయితే అమ్మోరు తల్లి పార్ట్ వన్ చిత్రీకరించిన సమయంలో నయనతార ఉపవాసం ఉండి నటించిందట. ఇప్పుడు కూడా అదే విధంగా ఉపవాసం ఉండి నటించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు పూజ చేసిన వారం ముందు నుంచే తన పిల్లలతో కలిసి నయనతార ఉపవాసం స్టార్ట్ చేసిందని ప్రొడ్యూసర్ ఐసరి గణేష్ చెప్పారు. ఈ సినిమా పూజలో ఫస్ట్ సీన్ కూడా తీశారు. నయనతార మూకుత్తి అమ్మన్ ను దర్శనం చేసుకునే సీన్ ను డైరెక్టర్ సుందర్ సి షూట్ చేశారట. ఈ సినిమా షూటింగ్ మార్చి 15 నుంచి స్టార్ట్ అవుతుందట. ఐసరి గణేష్ వేల్స్ ఫిల్మ్స్ తో కలిసి నయనతార రౌడీ పిక్చర్స్, ఖుష్బూ సుందర్ సికి చెందిన అవని సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయట.