అల్లు అర్జున్ కు విలన్ గా మారబోతున్న నేషనల్ క్రాష్

'నేషనల్ క్రష్' రష్మిక మందన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రతినాయకిగా (విలన్‌గా) నటించబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది

Published By: HashtagU Telugu Desk
Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

Nampally Court deals a blow to Icon Star Allu Arjun.

Allu Arjun – Atlee Film : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ (AA22) గురించి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక క్రేజీ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు ప్రతినాయకిగా (విలన్‌గా) నటించబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లిగా బన్నీతో డ్యూయెట్లు పాడిన రష్మిక, ఇప్పుడు అదే హీరోను ఢీకొట్టే నెగటివ్ రోల్‌లో కనిపిస్తుందనే వార్త ఫ్యాన్స్‌లో అంచనాలను అమాంతం పెంచేసింది.

ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో అట్లీ ప్లాన్ చేస్తున్నారు. కథా నేపథ్యం ప్రకారం ఇందులో ఐదుగురు హీరోయిన్లకు స్కోప్ ఉందని, వారిలో రష్మిక పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతుందని సమాచారం. ఇప్పటివరకు కేవలం గ్లామర్ మరియు బబ్లీ పాత్రల్లోనే మెప్పించిన రష్మికకు, ఈ నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ కెరీర్ పరంగా పెద్ద మలుపు కానుంది. అట్లీ సినిమాల్లో విలన్ పాత్రలు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయి కాబట్టి, బన్నీ-రష్మిక మధ్య సాగే మైండ్ గేమ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం రష్మిక మందన్న చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న ‘మైసా’, ‘రణబాలి’ వంటి చిత్రాలు ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే, వెండితెరపై ఈ క్రేజీ జోడీ మధ్య సాగే పోరు థియేటర్లను షేక్ చేయడం ఖాయం. మరోవైపు అల్లు అర్జున్ తన ‘పుష్ప-2’ పనులను పూర్తి చేసి, ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు.

  Last Updated: 06 Feb 2026, 09:42 AM IST