Chaitu : కుటుంబ ప్రతిష్ట దిగజార్చే పనులు చేయను.. చైతూ కామెంట్స్ వైరల్!

అక్టోబర్ 2న విడిపోతున్నట్లు నాగచైతన్య, సమంత ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వారిద్దరూ కెరీర్ పై ఫోకస్ చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఇంటరాక్షన్‌లో తన కుటుంబ సభ్యులను ఇబ్బంది

  • Written By:
  • Publish Date - December 16, 2021 / 12:16 PM IST

అక్టోబర్ 2న విడిపోతున్నట్లు నాగచైతన్య, సమంత ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వారిద్దరూ కెరీర్ పై ఫోకస్ చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఇంటరాక్షన్‌లో తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే పాత్రలను తాను చేయనని నాగ చైతన్య వెల్లడించాడు. ఇది పరోక్షంగా  సమంత కెరీర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని పలువురు అభిప్రాయపడ్డారు. సమంత అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీలో తన మొదటిసారిగా ఐటమ్ సాంగ్‌ చేసింది. ఇది డిసెంబర్ 17 న థియేటర్లలో విడుదల కానుంది. సమంత, నాగ చైతన్య భార్యాభర్తలుగా విడిపోయారని అధికారికంగా ప్రకటించారు. ఈ జంట పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. 200 కోట్ల భరణానికి సమంత నో చెప్పిందని వార్తలు వినిపించాయి.

ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో నాగ చైతన్యను విభిన్నమైన పాత్రలు చేయడం గురించి అడిగారు. ‘‘అన్ని రకాల పాత్రలకు నేనే ఓకే అని, అయితే ఆ పాత్రలు నా కుటుంబాన్ని, మా ప్రతిష్టను ప్రభావితం చేయకూడదని, నా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించే పాత్రలను నేను అంగీకరించను’’ అని సమాధానమిచ్చారు. అయితే ఇది సమంత కెరీర్ గురించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు అని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారణాలను చెప్పలేదు. అయితే, చై, అతని కుటుంబం కఠినమైన నిబంధనలను విధించారని, సమంత కెరీర్ ను ఎంకరుజ్ చేయడం లేదనే రూమర్స్ వచ్చాయి. సమంత చివరిగా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో కనిపించింది. ఇందులో ఆమె కొన్ని బోల్డ్ సన్నివేశాలు చేసింది. అలాగే పుష్పలో మొట్టమొదటి ఐటెమ్ సాంగ్, ఊ అంటావా అంటూ హోరెత్తించింది.

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత దూకుడుగా వ్యవహరిస్తోంది. కొన్ని బోల్డ్ పాత్రలకు సై అంటోంది. ఐటెం సాంగ్‌ నుంచి, హాలీవుడ్ మూవీ వరకు ఇలా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటోంది. అయితే హాలీవుడ్ మూవీలోనూ బై సెక్సువల్ గా సమంత నటించనుంది. ఇక నాగ చైతన్య చివరిగా లవ్ స్టోరీలో కనిపించాడు. ప్రస్తుతం తన తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమా షూటింగ్‌లో ఉన్నాడు.