Mukesh Ambani-Alia Bhatt : ప్రముఖ హీరోయిన్ ఆలియా భట్ కు “ఎడ్-ఎ-మమ్మ” పేరుతో చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ఉంది.
ఇందులో చిన్న పిల్లల దుస్తులను విక్రయిస్తుంటారు.
దీన్ని కొనుగోలు చేసేందుకు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ బ్రాండ్స్ ప్రతినిధులు ఆలియా భట్ తో చర్చలు జరుపుతున్నారు.
ఒకవేళ ఫైనల్ అయితే.. ఈ డీల్ విలువ దాదాపు రూ.350 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పది రోజుల్లో ఈ డీల్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు .
Also read : Congress Shuffule : రేవంత్ కు పొంచి ఉన్న పదవీగండం?
రిలయన్స్ బ్రాండ్స్ యొక్క మాతృ సంస్థ, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL). ఇది దేశంలోనే అతిపెద్ద రిటైలర్ లలో ఒకటి. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఈ బిజినెస్ గ్రూప్ ప్రస్తుతం కిడ్స్వేర్ డొమైన్ కోసం బ్రిటిష్ రిటైలర్ మదర్కేర్ పై ఆధారపడుతోంది. ఒకవేళ ఆలియా భట్ కు చెందిన “ఎడ్-ఎ-మమ్మ” (Ed-a-Mamma) చిల్డ్రన్ వేర్ బ్రాండ్ ను కొనుగోలు చేస్తే పిల్లల దుస్తుల మార్కెట్లో రిలయన్స్కు మరింత పట్టు పెరుగుతుందని అంటున్నారు. మనదేశంలో పిల్లల దుస్తుల మార్కెట్ సైజు దాదాపు రూ. 13,000 కోట్లు ఉంటుందని ఒక అంచనా. Ed-a-Mamma బ్రాండ్ ప్రోడక్ట్స్ సేల్స్ అనేవి ప్రధానంగా ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా, దాని స్వంత వెబ్సైట్ ద్వారా, Myntra, Ajio, FirstCry, Amazon, Tata CliQ వంటి యాప్లతో జరుగుతోంది. Ed-a-Mamma బ్రాండ్ ప్రోడక్ట్స్ ను లైఫ్స్టైల్, షాపర్స్ స్టాప్ వంటి రిటైల్ చైన్ల ద్వారా కూడా విక్రయిస్తున్నారు.
Also read : Sridevi Vijaykumar : చిలక పచ్చ రంగు చీరలో తన్మయింప చేస్తున్న శ్రీదేవి విజయకుమార్
పిల్లలు, పసిబిడ్డల కోసం 2020లో Ed-a-Mamma బ్రాండ్ ను ఆలియా భట్ ప్రారంభించారు. తర్వాతి దశల్లో ఈ బ్రాండ్ ను టీనేజ్, మెటర్నిటీ వేర్ విభాగాలకు కూడా విస్తరించారు. ఇది పర్యావరణ స్పృహతో కూడిన దుస్తుల బ్రాండ్. ఆలియా భట్.. “ఎటర్న్ ఆలియా క్రియేటివ్ అండ్ మర్చండైజింగ్”లో డైరెక్టర్గా ఉన్నారు. ఎడ్-ఎ-మమ్మా బ్రాండ్ ను ఈ సంస్థ(Mukesh Ambani-Alia Bhatt) ద్వారా నిర్వహిస్తున్నారు.