Ramcharan: చెర్రీతో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్.. అలాంటి పాత్రలో చరణ్?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చె

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 08:00 AM IST

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చెర్రీ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై నిర్మాత దిల్ రాజు బోలెడు ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా దిల్ రాజు ఇప్పటివరకు నిర్మించిన సినిమాలలో ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ సినిమా అని కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలనప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. బాలీవుడ్ లెజెండ్రీ దర్శకుల్లో సంజయ్ లీల బన్సాలి ఒకరు. ఇప్పుడు చరణ్ తో ఒక భారీ సినిమాను ప్లాన్ చేస్తున్నారని టాక్ బాలీవుడ్ లో జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోందని తెలుస్తోంది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం కూడా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సంజయ్ లీలా బన్సాలీ ఈ సినిమాను పాన్-ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారట. తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతుంది. సంజయ్ లీలా బన్సాలీ ప్రస్తుతం లవ్ అండ్ వార్ చిత్రం తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో అలియా భట్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ నటిస్తున్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తో ఒక భారీ హిస్టారికల్ మూవీ తెరకెక్కిస్తున్నారట. మొన్నామధ్య రామ్ చరణ్ ముంబైకి వెళ్ళింది కూడా సంజయ్ లీల సినిమా కోసమేనట. తన పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి చర్చించడానికే చరణ్ ముంబై వెళ్లారని టాక్. లెజెండ్ ఆఫ్ సుహెల్దేవ్ అనే అమిష్ త్రిపాఠి పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో సుహెల్‌ దేవ్ పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇది 1025 ADలో కాలం లో జరిగింది. మహమూద్ గజినీ శివుడి విగ్రహాన్ని పగలగొట్టి సోమనాథ్ ఆలయాన్ని దోచుకున్నాడు. శ్రావస్తి యువరాజు ఆలయాన్ని రక్షించడానికి వెళ్తాడు. కానీ ఆలయాన్ని రక్షించడంలో ఆయన తన ప్రాణాలను కోల్పోతారు. అతని తమ్ముడు సుహెల్దేవ్. వాస్తవానికి సుహెల్దేవ్ దీనికి ప్రతీకారం తీర్చుకుంటానని హామీ ఇచ్చాడు. 1034 CEలో బహ్రైచ్‌లో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం లో సుహెల్‌దేవ్ గజినీ సైన్యాన్ని ఓడించాడు. ఇదే కథతో ఇప్పుడు సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలి అంటే సంజయ్ లీలా కానీ రామ్ చరణ్ గానీ స్పందించే వరకు వీరి చూడాల్సిందే మరి.