హ్యాపీ ఫ్యామిలీ ఫోటోని మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందరి ఆశీర్వాదం వల్లే సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడని రాసుకొచ్చాడు. ఈ ప్రమాదం మా కుటుంబ సభ్యులందరికీ నిజమైన పండుగ అని సాయి ధరమ్ తేజ్ అన్నారు.
అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ. @IamSaiDharamTej pic.twitter.com/DZOepq88ON
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 5, 2021
సెప్టెంబర్ 10వ తేదీన సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జిపై బైక్ నడుపుతుండగా బైక్ అదుపుతప్పి పడిపోయాడు. ప్రమాదంలో చేయి విరగడంతో చాలా రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అందుకే సాయి ధరమ్ తేజ్ తన సినిమా విడుదలైన తర్వాత కూడా వాటి ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయాడు. మెగా ఫ్యామిలీ చాలా కాలం తర్వాత సాయి ధరమ్ తేజ్ అభిమానులకు శుభవార్త చెప్పింది.
కాస్త కోలుకున్నాక సాయి ధరమ్ తేజ్ ఇంటికి వచ్చాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. దీంతో మెగా హౌస్లో పండగ వాతావరణం నెలకొంది. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు.