Meena 2nd Marriage : దక్షిణాది సినీ పరిశ్రమలో దశాబ్దాల కాలంగా స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటి మీనా, తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తన రెండో పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మరియు కొన్ని వెబ్ సైట్లలో జరుగుతున్న ప్రచారంపై ఆమె తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
తన రెండో వివాహం గురించి జరుగుతున్న నిరంతర చర్చపై మీనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “నా రెండో పెళ్లి గురించి పుకార్లు పుట్టిస్తున్న వారు కనీసం నాకు ఒక టీనేజ్ కూతురు ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇలాంటి నిరాధారమైన వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధగా, కోపంగా అనిపిస్తుంది” అని పేర్కొన్నారు. తన జీవితం మరియు తన కుమార్తె నైనికా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కేవలం రేటింగ్స్ కోసం ఇటువంటి వార్తలు సృష్టించడం సరికాదని ఆమె హితవు పలికారు.
మీనా భర్త విద్యాసాగర్ 2022లో ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది. భర్త మరణం తర్వాత మీనా తన కుమార్తె బాధ్యతలను భుజాన వేసుకుని, తిరిగి సినీ రంగంలో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను ఏదో ఒక నటుడితో లేదా వ్యాపారవేత్తతో ముడిపెడుతూ వార్తలు రావడం ఆమెను మానసిక వేదనకు గురిచేస్తోంది. ప్రస్తుతానికి తన దృష్టి అంతా కుమార్తె పెరవడి మరియు తన కెరీర్ మీద మాత్రమే ఉందని ఆమె స్పష్టం చేశారు.
వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, మీనా వృత్తిపరంగా తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన బ్లాక్ బస్టర్ సిరీస్ ‘దృశ్యం-3’లో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం నటిగానే కాకుండా, పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తున్నారు. తన జీవితంలో రెండో పెళ్లి ఆలోచనే లేదని ఆమె చెప్పడంతో, ఇప్పటికైనా ఈ పుకార్లకు చెక్ పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
