Dil Se : ‘దిల్‌ సే’ సినిమాకి మనీషా కొయిరాలా మొదటి ఛాయస్ కాదట.. ఆ స్టార్ హీరోయిన్..!

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తో తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన సినిమా 'దిల్ సే' (Dil Se). రొమాంటిక్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో మనీషా కొయిరాల హీరోయిన్ గా నటించింది.

  • Written By:
  • Publish Date - October 28, 2023 / 09:30 PM IST

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తో తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన సినిమా ‘దిల్ సే’ (Dil Se). రొమాంటిక్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో మనీషా కొయిరాల హీరోయిన్ గా నటించింది. మరో భామ ప్రీతిజింటా సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. 1998లో రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.28 కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న మనీషా కొయిరాలకి(Manisha Koirala) ఈ మూవీ ఒక మైల్ స్టోన్ గా నిలిచింది.

ఈ సినిమాతో నార్త్ టు సౌత్ ఆడియన్స్‌ని, దర్శకనిర్మాతల దృష్టిని మనీషా ఆకర్షించింది. దీంతో వరసపెట్టి ఆఫర్స్ వచ్చాయి. ఒకానొక స్టేజిలో ఇండియన్ టాప్ యాక్ట్రెస్ గా నిలిచింది. దిల్ సే సినిమా మనీషాకి అంతటి ఫేమ్ ని సొంతం చేసింది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదటి ఎంపిక మనీషా కాదట. ఈ భామ కంటే ముందు మణిరత్నం మరో హీరోయిన్ ని సంప్రదించాడట. ఆమె నో అనడంతో ఆ ఛాన్స్ మనీషాకి వచ్చింది.

ఆల్రెడీ 1995లో షారుఖ్ ఖాన్ పక్కన ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమాలో హీరోయిన్ గా నటించి ఆడియన్స్ మనసు గెలుచుకున్న హీరోయిన్ ‘కాజోల్’. ఈ చిత్రంలో వీరిద్దరి జంట ప్రతి ఒక్కర్ని ఆకట్టుకొని బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ అనిపించుకుంది. దీంతో దిల్ సే కూడా ఆ కాంబినేషనే రిపీట్ చేస్తే.. లవ్ స్టోరీకి ఆడియన్స్ మరింత కనెక్ట్ అవుతారని మణిరత్నం భావించాడట. ఈ ఆలోచనతోనే కాజోల్ ని కూడా సంప్రదించాడు. కానీ ఆమె ఏవో కారణాలతో నో చెప్పడంతో మనీషా ఆ స్థానంలోకి వచ్చింది. దీంతో మనిషా కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.

Follow us