Site icon HashtagU Telugu

Manchu Family Controversy : కలెక్టర్ వద్దకు మంచు గొడవ

Manchu Vishnu Manoj

Manchu Vishnu Manoj

మంచు కుటుంబానికి చెందిన ఆస్తులపై జరుగుతున్న వివాదం (Manchu Family Controversy) మరోసారి చర్చనీయాంశమైంది. జల్పల్లిలోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ప్రముఖ నటుడు మోహన్ బాబు (Mohan Babu) ఇటీవల రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో కలెక్టర్ ఆ ఇంటిలో నివసిస్తున్న మంచు మనోజ్‌(Manchu Manoj)కు నోటీసులు పంపించారు. కాగా ఈరోజు మంచు మనోజ్ కలెక్టర్‌ను కలిసి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ ఆస్తుల వివరాలు, ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు, వివాదాలపై చర్చించారు. మనోజ్ కలెక్టర్‌కు తన వాదనను వివరించి, తమ కుటుంబంలో చోటుచేసుకున్న సమస్యలపై స్పష్టమైన సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

Samsung : సరికొత్త 9KG ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్‌లను విడుదల

మోహన్ బాబు తన ఆస్తుల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మేజిస్ట్రేట్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కలెక్టర్ కార్యాలయంలో కూడా చర్చ జరిగింది. ఇక ఇంటిపై ఉన్న వివాదాన్ని పరిష్కరించడానికి సంబంధిత అధికారులు త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. న్యాయపరమైన పద్ధతుల్లో ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు మోహన్ బాబు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మనోజ్ ఇచ్చిన వివరణకు సంబంధించి అధికారులకు మరిన్ని ఆధారాలు సమర్పించాలని సూచించారని సమాచారం. ఇదిలా ఉంటె సోషల్ మీడియా లో మనోజ్ vs విష్ణు ల మధ్య వార్ తారాస్థాయికి వెళ్తుంది. ‘కుక్క’ అంటూ ఒకరిపై ఒకరు ఇన్ డైరెక్ట్ గా ట్వీట్స్ చేసుకొని కాకరేపారు. ఓవరాల్ గా మాత్రం మంచు ఫ్యామిలీ లో జరుగుతున్న ఈ గొడవలు సినీ ఇండస్ట్రీ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది.