Site icon HashtagU Telugu

Manchu Manoj : ముఖేష్ అంబానీ తో మంచు మనోజ్..

Manoj Mukesh

Manoj Mukesh

మంచు మనోజ్ దంపతులు (Manchu Manoj) ముఖేష్ అంబానీ ని కలిశారు. రిలయన్స్, జీయో అధినేత ముఖేష్‌ అంబానీ(Mukesh Ambani)కి సంబంధించిన ఈవెంట్‌లో మంచు మనోజ్‌.. తన భార్య మౌనికా రెడ్డి లు పాల్గొన్నారు. ముంబయిలో అత్యంత లగ్జరీ మాస్‌ `జీయో వరల్డ్ ప్లాజా`(Jio World Plaza)ని బుధవారం ప్రారంభించారు. ఇది లగ్జరీ షాపింగ్‌ మాల్‌. సెలబ్రిటీలకు అడ్డా అయినా బాండ్రాలో దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినిమా సెలబ్రిటీలు చాలా మంది పాల్గొన్నారు. అయితే ఇందులో మంచు మనోజ్‌, మౌనికారెడ్డిల జంట సందడి చేయడం విశేషం.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఆహ్వానం పొందిన ఏకైక తెలుగు హీరో మంచు మనోజ్‌ కావడం విశేషం. హీరోయిన్లు శృతి హాసన్‌, రష్మిక, పూజా, రకుల్‌ వంటి వారు ఇందులో పాల్గొన్నారు. కానీ హీరోల్లో మాత్రం మంచు మనోజ్‌కి మాత్రమే ఇందులో పాల్గొనడం ఆశ్చర్యపరుస్తుంది. అంతే కాదు అంబానీ ప్రత్యేకంగా మనోజ్ తో ముచ్చటించడం అక్కడి వారిని ఆశ్చర్యంలో పడేసింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇక మంచు మనోజ్ విషయానికి వస్తే..అందరి హీరోల అభిమానులకు చాలా దగ్గరైన హీరోగా మనోజ్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎక్కడ..ఎప్పుడు అనవసరంగా మాట్లాడడు.. స్నేహానికి ప్రాణం ఇస్తాడు. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్.. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. తాను ప్రేమించిన భూమా మౌనికను రెండో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం మనోజ్ కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. మనోజ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు.. ఒక షో ఉన్నాయి. వీటితో బిజీ గా ఉన్నాడు.

Read Also : Chandrababu : చంద్రబాబు ఇంటికి ఏఐజీ వైద్యుల బృందం