Malla Reddy : బిజినెస్ మాన్ చూసి రాజకీయాల్లోకి వచ్చా – మంత్రి మల్లారెడ్డి

మహేష్ బాబు గారు.. నేను మీ సినిమా బిజినెస్ మేన్ చూసి నేను రాజకీయాల్లోకి వచ్చాను

Published By: HashtagU Telugu Desk
Mallareddy Business Man

Mallareddy Business Man

మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) మరోసారి సోషల్ మీడియా లో వైరల్ గా మారారు. రణబీర్ కపూర్ (Ranabir Kapoor) – రష్మిక (Rashmika) జంటగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా (Sandeep Vanga) తెరకెక్కించిన యానిమల్ ( (Animal)) మూవీ డిసెంబర్ 01 న పాన్ ఇండియా గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమా ఫై అంచనాలు రెట్టింపు చేసింది. తెలుగు ఆడియన్స్ సైతం ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృతగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్ లో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుక కు ముఖ్య అతిధులుగా మహేష్ బాబు (Mahesh Babu) , రాజమౌళి (Rajamouli) , మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ..“ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీకి యానిమల్ చిత్ర యూనిట్ వచ్చింది. మహేష్ బాబు గారు.. నేను మీ సినిమా బిజినెస్ మేన్ చూసి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆ సినిమా పదిసార్లు చూసి ఎంపీ అయ్యాను. సేమ్ మోడల్.. సేమ్ సిస్టమ్. రణబీర్ నీకు నేనొక విషయం చెప్తాను. అప్పట్లోనే నేను చెప్పాను.. బాలీవుడ్, హాలీవుడ్ ను.. తెలుగు హీరోలు రూల్ చేస్తారు అని.. మా తెలుగువాళ్లు చాలా స్మార్ట్. రాజమౌళి, దిల్ రాజు ఇప్పుడు సందీప్ వచ్చాడు. హాలీవుడ్, బాలీవుడ్ ను హిందుస్థానీ రూల్ చేస్తోంది. హైదరాబాద్ అందులో టాప్ మోస్ట్.. మా తెలుగు ప్రజలు చాలా స్మార్ట్. పుష్పతో అల్లు అర్జున్.. దుమ్మురేపాడు.. ఇప్పుడు సందీప్ మరోసారి బాలీవుడ్ లో దుమ్మురేపుతాడు. మల్లారెడ్డి యూనివర్సిటీలో నాలుగుసార్లు అశ్వమేధ యాగం జరిగింది. ఇక్కడ ఇంజనీర్లు, డాక్టర్లు తయారవుతున్నారు. ఇక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా కూడా 500 కోట్లు కలక్షన్స్ వస్తాయి .. పక్కా.. ఈ సినిమా సూపర్ హిట్”అని చెప్పుకొచ్చారు. ఇక మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుంటే గ్రాండ్ అంత మారుమోగిపోయింది. ఇక మహేష్ బాబు సైతం ఫుల్ గా ఎంజాయ్ చేసాడు.

Read Also : ShashtiPurthi Movie : లేడీస్ టైలర్ జంట రిపీట్.. షష్టిపూర్తి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

  Last Updated: 28 Nov 2023, 12:46 PM IST