Site icon HashtagU Telugu

Guntur Kaaram: గుంటూరు కారం ఎపిసోడ్ రీషూట్, ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కే 6 కోట్ల ఖర్చు!

Mahesh Babu Guntur Kaaram Movie will releasing on Sankranthi no change

Mahesh Babu Guntur Kaaram Movie will releasing on Sankranthi no change

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు తన రాబోయే చిత్రం ‘గుంటూరు కారం’లో ఒక ప్రత్యేకమైన యాక్షన్ ఎపిసోడ్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు గుసగుసలు వినిపించడంతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తం యూనిట్‌ను సంతృప్తిపరిచేలా యాక్షన్ ఎపిసోడ్‌ను రీషూట్ చేశారు. “మహేష్ బాబు మరింత గ్రిప్పింగ్, రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌ని కోరుకుంటున్నందున ఈ యాక్షన్ ఎపిసోడ్ రీషూట్ చేయబడింది” అని తెలుస్తోంది.

“మహేష్ బాబు అభిమానులను ఆకట్టుకోవడానికి బాగా డిజైన్ చేసిన యాక్షన్ బ్లాక్ కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీంతో మొదటి కన్నా రెండోది బాగా వచ్చిందని టాక్. మహేష్ బాబు ఈ యాక్షన్-సెంట్రిక్ ఎంటర్‌టైనర్‌ను తన అభిమానులను ఎంటర్ టైన్ చేయడానికి, బాక్సాఫీస్ వద్ద సంచలనాత్మక ఓపెనింగ్స్‌ నమోదు చేయడానికి ఆసక్తితో ఉన్నాడు.

ఈ మూవీతో ఇతర సినిమా రికార్డులను బ్రేక్ చేయడానికి భావిస్తున్నాడు. యుఎస్‌లోని వివిధ నగరాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర తమిళనాడు, కేరళలోనూ ఫాలోయింగ్ ఉంది. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలతో నడిచే చిత్రాన్ని విస్తృత వర్గాల ప్రేక్షకులకు చేరువ చేయడంలో మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జతకట్టాడు. త్రివిక్రమ్ పెద్ద హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

Also Read: Hyderabad: హైదరాబాద్ లో ఇద్దరు చిన్నారులు అదృశ్యం