Mahesh Babu: మహేశ్ చాలా సింపుల్ గా ఛాన్స్ ఇచ్చాడు- డైరెక్టర్ పరశురామ్..!!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సర్కారు వారి పాట.

  • Written By:
  • Publish Date - May 2, 2022 / 06:00 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సర్కారు వారి పాట. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయ్యింది. మే 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 2న చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు పరశురామ్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

గీతగోవిందం సినిమా నిర్మిస్తున్న సమయంలో సర్కారు వారి పాట మూవీ స్టోరీని రాసానని దర్శకుడు పరశురామ్ తెలిపారు. కానీ మహేశ్ బాబు ముందుకు ఈ స్టోరీ తీసుకెళ్లడానికి తాను సంకోచించినట్లు వెల్లడించారు. మహేశ్ తనకు కథ చెప్పే అవకాశాన్ని చాలా సింపుల్ గా ఇచ్చేసాడని చెప్పుకొచ్చాడు. స్టోరీ చెప్పుతున్న సమయంలో మహేశ్ ఆ పాత్రలతో కనెక్ట్ అయ్యాడని…అందుకే ఈ మూవీకి అంగీకరించారని చెప్పాడు. మహేశ్ కి స్క్రిప్టుపై గట్టి పట్టు లభించిన తర్వాతే..తాను ఓకే చెప్పినట్లు పరశురామ్ వివరించారు.

పరశురామ్ కెరీర్ గ్రాఫ్ ను పరిశీస్తే…సారొచ్చారు మూవీ అనుకున్న స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత కొన్ని ఏండ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని…ఆ తర్వాతే ఈ సక్సెస్ స్టోరీలు తనకు లభించాయని చెప్పుకొచ్చారు. సర్కారు వారి పాట మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ మూవీ అందుకోలగలదన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా యూత్ ను మెప్పించేలా హీరో హీరోయిన్ల మధ్ మంచి కెమిస్ట్రీతో కూడిన సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. సినిమా రషెస్ చూసినప్పుడు మహేశ్ క్యారెక్టరైజేషన్ ఇతర సినిమాలతో పోల్చితే నెక్ట్స్ లెవల్లో ఉన్నట్లు అనిపించిదన్నారు.