Mahesh Babu: తేజా సజ్జాకు వార్నింగ్ ఇచ్చిన మహేష్ బాబు.. అలా పిలవడం మానేయ్ అంటూ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలె గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన తదుపరి సినిమా

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 07:30 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలె గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన తదుపరి సినిమా రాజమౌళితో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. గుంటూరు కారం సినిమా ఈ ఏడాది జనవరిలో అనగా సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. గుంటూరుకారం మూవీకి పోటీగా యంగ్ హీరో తేజా సజ్జ హనుమాన్ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సంక్రాంతి 12న ఈ రెండు చిత్రాలు విడుదల అయ్యాయి.

కానీ మహేశ్ బాబు కంటే తేజా సినిమానే వందశాతం సక్సెస్ ను అందుకుంది. అయితే హనుమాన్ మూవీ ప్రమోషన్స్, సక్సెస్ మీట్ తర్వాత తేజా సజ్జా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ను చెప్పారు. మహేశ్ బాబు తనను ఒక విషయంలో తిట్టారని చెప్పారు. తను ఇంటర్వ్యూలో ఉన్న సందర్బంలో మహేశ్ బాబు గురించి టాపిక్ వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. యువరాజులో సూపర్ స్టార్ కు కొడుకుగా నటించాను. అప్పుడు మహేశ్ బాబును మగేశ్ బాబు.. మగేశ్ బాబు అని పిలిచాను అని అన్నారు తేజా.

అందుకు మహేశ్ బాబు కాస్తా అప్సెట్ అయ్యి… ఓరేయ్ నీకు పిలవడం రాకపోతే మానేయ్ కానీ.. ఇలా మాత్రం పిలవకురా బాబు అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. బాబుతో తనకున్న మెమోరీని గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పనులను మొదలు పెట్ట నున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తన భార్య పిల్లలతో కలిసి వెకేషన్ కు వెళ్లారు. వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత షూటింగ్లో పాల్గొనబోతున్నారు మహేష్ బాబు.