భారతీయ సెలబ్రిటీలు నటనలో కాకుండా ఇతర వ్యాపారాలలోకి ప్రవేశించడం కొత్తేమీ కాదు. అయితే చాలామందికి రెస్టారెంట్ వ్యాపారం సిరులు కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోని అనేక రెస్టారెంట్లు, కేఫ్ల యజమానులుగా టాలీవుడ్ స్టార్స్ చెలామణి అవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్లో సౌత్ సెలబ్రిటీ మహేష్ బాబు కూడా చేరారు. ఇప్పటికే AMB థియేటర్స్ ప్రారంభించిన ప్రిన్స్ హైదరాబాద్లోని రెస్టారెంట్ వ్యాపారం ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.
బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 12లో విలాసవంతమైన రెస్టారెంట్ను ప్రారంభించేందుకు ప్రముఖ నగరానికి చెందిన ఫుడ్ బ్రాండ్ మినర్వాతో జతకట్టినట్లు సమాచారం. ఇది హైదరాబాద్లోని నీలోఫర్ కేఫ్ పక్కనే, ఈ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెస్టారెంట్ ఏయే ఫుడ్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే థియేటర్స్ స్థాపించిన మహేశ్ ఈ రంగంలో ఏవిధంగా నెలదొక్కకుంటాడో వేచి చూడాల్సిందే. ఇక సినిమాల విషయానికొస్తే మహేశ్ మహేష్ బాబు S S రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్లతో చేయనున్నాడు.