Krishnam Vande Jagadgurum : ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ టైటిల్ సాంగ్ రాయడానికి ఎన్ని నెలలు పట్టిందో తెలుసా..? మొదట సాంగ్ లెంగ్త్..

మత్య్స, కూర్మ, వరాహ, నరసింహ అవతారాల గురించి ఒక్క పాటలో చెప్పాలని క్రిష్ భావించాడు. ఇంకేముంది తన గురువుగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఈ విషయం చెప్పాడు.

  • Written By:
  • Publish Date - November 14, 2023 / 07:30 PM IST

క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో రానా(Rana), నయనతార(Nayanthara) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’. గమ్యం’, ‘వేదం’ వంటి సినిమాల తరువాత క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ఆ సమయంలో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ మూవీ రిలీజ్ సమయానికి ఆ అంచనాలు మరింత పెరగడానికి ఒక సాంగ్ కారణమైంది. మత్య్స, కూర్మ, వరాహ, నరసింహ అవతారాల గురించి ఒక్క పాటలో చెప్పాలని క్రిష్ భావించాడు. ఇంకేముంది తన గురువుగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఈ విషయం చెప్పాడు.

సీతారామశాస్త్రి ఈ పాటని ఒక ఛాలెంజ్, ఆయనకి వచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావించి.. తన కలంతో అద్భుతం సృష్టించారు. దాదాపు రెండున్నర నెలలు పాటు ఈ పాట కోసం కష్టపడ్డారట. దశావతారాలు గురించి ఎంతో రీసెర్చ్‌ చేసి కృష్ణం వందే జగద్గురుమ్‌ సాంగ్ ని రచించారు. ఇక ఈ పాటకి స్వరబ్రహ్మ మణిశర్మ ఇచ్చిన సంగీతం మరో స్థాయికి తీసుకు వెళ్ళింది. ఇక ఈ భాగవతలీలలను బాలసుబ్రమణ్య గానంతో వింటుంటే.. ఆడియన్స్ కి కళ్ళ ముందే మహాభాగవతం కనిపించింది.

అయితే ఈ పాటని మొదట రికార్డు చేసినప్పుడు 15 నిమిషాలు వచ్చిందట. ఆ తరువాత దానిని 12 నిమిషాలకు కుదించారు. అయితే క్రిష్ దానిని ఇంకా తగ్గించాడు. పాట అంత సమయం ఉంటే ప్రేక్షకులు ఆస్వాదించలేరేమోనన్న సందేహంతో 9 నిమిషాల 20 సెకన్లకు ఆ పాటని క్రిష్‌ తగ్గించాడు. ఇక ఈ పాటలో, సినిమాలో రానా చేసిన నటన కూడా ఆడియన్స్ ని బాగా అక్కట్టుకుంది. ఇప్పటికి చాలా ఈవెంట్స్ లో ఈ పాటని ప్రదర్శించడం ఒక ఛాలెంజ్ తీసుకుంటుంటారు నృత్య కళాకారులు.