ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. నటి ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘గోవింద నామ్ మేరా’ అనే బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. విక్కీ కౌశల్ కూడా ఈ సినిమాలో భాగమయ్యాడు. టీమ్ బిజిలీ పేరుతో వారి మొదటి డ్యాన్స్ ట్రాక్ని విడుదల చేసింది. ఇందులో కియారా మత్తెక్కించే డాన్స్ తో అట్రాక్ట్ చేసింది.
కియారా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో షేర్ చేసిన వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. రంగురంగుల ప్రింటెడ్ దుస్తులను ధరించి, ఆక్వా టై-అప్ బ్లౌజ్లో నటి అద్భుతంగా డాన్స్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం కియారా అద్వానీ తదుపరి RC15 లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్లో జరుగుతోంది.