Keerthy Suresh: మహబూబ్ నగర్ లో మహనటి క్రేజ్.. కీర్తి చీరకట్టుకు ఫ్యాన్స్ ఫిదా!

కీర్తి సురేష్ గొప్ప నటి మాత్రమే కాదు.. సౌత్‌లో మోస్ట్ ఫ్యాషనబుల్ నటి. కీర్తి సురేష్ అని వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చీర.

  • Written By:
  • Updated On - September 15, 2022 / 04:49 PM IST

కీర్తి సురేష్ గొప్ప నటి మాత్రమే కాదు.. సౌత్‌లో మోస్ట్ ఫ్యాషనబుల్ నటి. కీర్తి సురేష్ అని వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చీర. ఆమె ఆరు గజాల చీరలో అందాల రాణిగా కనిపిస్తుంది. పట్టు, సిల్క్, చేనేత ఏ చీరలోనైనా ఇట్టే ఒదిగిపోతోంది. అందుకే కీర్తి చీరకట్టుకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ తాజాగా తెలంగాణలోని మహాబూబ్ నగర్ జిల్లాలో సందడి చేసింది. క్లాత్ షోరూం ప్రారంభానికి అటెండ్ అయ్యింది.

ఆమె ముదురు ఊదా రంగు బ్లౌజ్‌తో కూడిన రంగు పూల చీరతో హోయలు ఒలకబోసింది. తన జుట్టును గజ్రాతో బన్‌లోకి లాగి ఆకట్టుకుంది. ఈ ఈవెంట్‌లో తన కోసం గంటల తరబడి వేచి ఉన్న అభిమానులతో కీర్తి సురేష్ కూడా ఫోటోలు దిగింది. గుమికూడిన భారీ జనసమూహం వైపు కూడా ఆమె చేతులు ఊపుతూ ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చింది. రోజా పూలు విసిరింది.

కీర్తి సురేష్ ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరాలో ఉన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లో ఆమె నేచురల్ స్టార్ నానితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. తెలంగాణలోని గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనులలోని ఒక గ్రామం నేపథ్యంలో దసరాను యాక్షన్-ప్యాక్డ్ డ్రామాగా రూపొందించారు. మరి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఫహద్ ఫాసిల్, ఉదయనిధి స్టాలిన్, వడివేలు కూడా నటించిన తమిళ చిత్రం మామన్నన్ కోసం ఆమె ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.