Keerthy Suresh: పాన్ ఇండియా నిర్మాతలతో కీర్తి సురేష్ సినిమా.. టైటిల్ అదిరిపోయిందిగా?

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగుతోపాటు తమిళ

  • Written By:
  • Publish Date - December 4, 2022 / 06:47 PM IST

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగుతోపాటు తమిళ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ పాత్రలో నటిస్తూనే మరొకవైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది. ఈమె తెలుగులో నాని నటిస్తున్న దసరా మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ కొత్త మూవీకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ముదుగుమ్మ కీర్తి సురేష్ ఏకంగా కేజీఎఫ్,కాంతార లాంటి పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించిన హోంబలే నిర్మాణ సంస్థలో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించబోతోంది. ఆ సినిమా రగ్ తాథా పేరుతో రూపొందనుంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ ప్రధానపాత్రలో నటిస్తోంది. హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తున్న తొలి త‌మిళ చిత్రం కూడా ఇదే కావ‌టం గ‌మ‌నార్హం. కాగా ఇప్పటికే తెలుగులో హోంబలే నిర్మాణ సంస్థ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

హోంబలే నిర్మాణ సంస్థ ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తిని చూపిస్తోంది. రగ్ తాథా అనే ప‌దానికి అర్థం ఏంటి అన్న విషయానికి వస్తే.. హిందీలో ఉండే ర‌హ్ తాథా అనే పదాన్ని త‌మిళులు కొంద‌రు ర‌గ్ తాథా అని సంబోధిస్తుంటారు. ఆ యాంగిల్‌లోనే ఈ టైటిల్‌ను పెట్టి ఉండ‌వ‌చ్చున‌ని మీడియా వ‌ర్గాల్లో వినిపిస్తున్న టాక్‌. ఈ డిఫ‌రెంట్ టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం సినిమాను ఏమైనా సెటిరిక‌ల్ కామెడీగా తెర‌కెక్కించ‌బోతున్నారా నా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై కీర్తి సురేష్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి..