Janhvi Kapoor: భాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుమలను దర్శించుకున్న జాన్వీ.. ఫొటో వైరల్

తాజాగా జాన్వీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు.

  • Written By:
  • Updated On - April 3, 2023 / 12:17 PM IST

బాలీవుడ్ బ్యూటీ, బోనీ కపూర్ బిడ్డ జాన్వీ కపూర్ నిత్యం వార్తల్లో కనిపించడం సర్వసాధారణం. జాన్వీ జిమ్ కెళ్లినా.. షూటింగ్ స్పాట్ లో ప్రత్యక్షమైనా.. బీచ్ లో అందాలు ఆరబోసినా నిమిషాల్లో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా జాన్వీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. బ్రేక్ టైమ్ లో స్వామివారిని దర్శించుకొని ఆధ్యాత్మిక సేవలో తరించారు. తెలుగుదనం ఉట్టిపడేలా లంగావోణీలో  కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం భక్తులు జాన్వీతో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు.

అయితే ఈ బ్యూటీ డేటింగ్ ఉన్నట్ట ఎప్పట్నుంచో వార్తలు హాల్ చల్ చేస్తున విషయం తెలిసిందే. ఇటీవల జాన్వీ శిఖర్ అనే కుర్రాడితో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నట్టు వీడియోలు, ఫొటోలు బయటకువచ్చాయి. తాజాగా మరోసారి తన భాయ్ ఫ్రెండ్ శిఖర్ తో తిరుమలకు రావడం, ఒక్కటిగా దేవుడ్ని దర్శించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ భాయ్ ఫ్రెండ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనువడు. ఎంట్రపెన్యూర్ కూడా.

జాన్వీ పలు పార్టీలు, ఫంక్షన్లకు శిఖర్ తో వెళ్లడం, వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జంట తిరుమల తిరుపతిలో కనిపించడంతో రూమర్ నిజమేనని నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇక జాన్వీ భాయ్ ఫ్రెండ్ శిఖర్ కూడా తాను జాన్వీతో రిలేషన్ లో ఉన్నట్టు మీడియాకు చెప్పాడు.