Kajal Ready Item Song: ప్యాన్ ఇండియా మూవీ ‘ఐటెం సాంగ్’ కు కాజల్ రెడీ?

లాక్‌డౌన్ సమయంలో గార్జియస్ లేడీ కాజల్ అగర్వాల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

  • Written By:
  • Updated On - September 27, 2022 / 02:45 PM IST

లాక్‌డౌన్ సమయంలో గార్జియస్ లేడీ కాజల్ అగర్వాల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఏప్రిల్‌లో ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. నీల్ కిచ్లు అని పేరు పెట్టింది. కాజన్ కెమెరా ముందుకొస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. ఈ ‘టెంపర్’ బ్యూటీ గ్లామర్ షో కు సైతం సై అంటోందట.

‘పుష్ప 2’లో కాజల్ అగర్వాల్‌ని తదుపరి ఐటెమ్ గర్ల్‌గా పరిశీలిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొదటి భాగంలో ‘ఊ అంటావా’ పాటతో సమంత క్రియేట్ చేసిన సంచలనం మనందరికీ తెలిసిందే. DSP మాస్ ట్యూన్‌, సమంత గ్లామర్ ప్రదర్శనతో పాట ట్రెండింగ్ గా నిలిచింది. దేశ విదేశాల్లో వినిపిస్తోంది. సమంత కూడా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఐటెం సాంగ్ ఆమెకు ఉత్తరాదిలో ‘ఫ్యామిలీ మేన్’ కంటే ఎక్కువ క్రేజ్ తెచ్చిపెట్టింది. అనేక ఆఫర్లతో బిజీగా ఉంది సమంత.

కాజల్ మళ్లీ స్క్రీన్ పై వెలిగిపోవాలని భావిస్తుండటంతో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో పాటు అందాలు ప్రదర్శిస్తే కచ్చితంగా హెల్ప్ అవుతుంది. ‘ఊ అంటావా’ పాట కోసం దిశా పటానిని పరిగణించారు. కానీ ఆమె అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో సుకుమార్ సమంత వైపు మొగ్గు చూపింది. బాలీవుడ్ బ్యూటీని సెకండ్ పార్ట్ కోసం తీసుకురావాలనే ఆలోచనలో సుకుమార్ లేడని, తెలిసిన హీరోయిన్ ను తీసుకోవాలని భావిస్తునాడట. కాజల్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నప్పటికీ, ఈ సమయంలో ఆమె ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరిస్తుందో లేదో వేచి చూడాలి. అయితే ఈ టాలీవుడ్ చందమామ జనతా గ్యారేజ్ లో ఓ ప్రత్యేక పాటలో మెరిసింది. ఆ పాట బాగా పాపులర్ అయ్యింది. ఆ పాటకు దేవి మ్యూజిక్ అందించడం విశేషం.