Manamey: శర్వానంద్ మనమే సినిమా నుంచి మొట్టమొదటి సాంగ్ రిలీజ్.. వీడియో వైరల్?

టాలీవుడ్ హీరో శర్వానంద్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఈయన నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపున

  • Written By:
  • Publish Date - March 28, 2024 / 05:30 PM IST

టాలీవుడ్ హీరో శర్వానంద్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఈయన నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒకటి కూడా లేదు అని చెప్పవచ్చు. గడిచిన ఆరేళ్లలో దాదాపు ఏడు సినిమాలు చేశాడు. కానీ ఊహించని విధంగా ఆ ఏడు సినిమాలు కూడా డిజాస్టర్ లుగా నిలిచాయి. దాంతో శర్వానంద్ సరైన హిట్ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు.

కాగా ఇటీవల శర్వానంద్ ఒక ఇంటి వాడైన విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల తన పుట్టినరోజు నాడు తన మూడు కొత్త సినిమాలను అనౌన్స్ చేశాడు. ఇది ఇలా ఉంటే శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 35వ సినిమాగా రాబోతుంది. కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసారు. ఈ సినిమా నుంచి ఇక నా మాటే అంటూ సాగే పాటని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

మెలోడీ మెజీషియన్ హేశం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ లో ఒక చిన్న పాపని చూపించారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి. ఇటీవలే విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.