Viral Pics : ఓ ఇంటివాడైన హీరో కార్తీకేయ..!

హీరో కార్తీకేయ గుమ్మకొండ టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా ఆర్‌ఎక్స్‌ 100తో అందర్నీ ఆకట్టుకున్నాడు.

  • Written By:
  • Updated On - November 21, 2021 / 03:44 PM IST

హీరో కార్తీకేయ గుమ్మకొండ టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా ఆర్‌ఎక్స్‌ 100తో అందర్నీ ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ లో  కండలవీరుడిగా ఈ హీరోకు పేరుంది. మొదటి సినిమాతోనే అమ్మాయిల కలల రాకుమారిడిగా మారిపోయాడు.

తాజాగా రాజావిక్రమార్కుడిగా సినిమాతో మనముందుకొచ్చిన ఈ హీరో ఓ ఇంటి వాడైయ్యాడు. తన బిటెక్‌ స్నేహితురాలైన లోహితను ఆదివారం చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని ఓ పంక్షన్‌ హాల్‌లో ఘనంగా జరిగిన ఈ వేడుకలకు టాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యి.. వధూవరులను దీవించారు. మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌, తనికెళ్ల భరణి, అజరు భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌ పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే రాజా విక్రమార్క ఇటీవల విడుదల కాగా, తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ నటిస్తున్న వలిమై చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనకు కాబోయే భార్యను కార్తికేయ పరిచయం చేశారు. తన ప్రేమకథ గురించి కార్తికేయ మాట్లాడుతూ “నేనే ప్రపోజ్ చేశా. తన మెసేజ్ కోసం ఎదురుచూశా. గిఫ్టులు ఇచ్చాను. నా లైఫ్ లో హీరో అవ్వడానికి పెట్టినంత స్ట్రగుల్ పెట్టాను. ఫోనులో ప్రపోజ్ చేశా.. అంటూ తన లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయ్యాడు.