Hanuman: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హనుమాన్.. భారీగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 10:31 AM IST

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఇందులో తేజా సజ్జా హీరోగా నటించగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును అందుకోవడంతో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది.

ఈ సినిమా విడుదల అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు. కాగా తాజాగా హనుమాన్ సినిమా ఆదివారం నాడు ఓటీటీలోకి వచ్చింది. ఇక హనుమాన్ ఓటీటీ కోసం ఎదురుచూసిన ఆడియెన్స్‌కు పండుగలా మారింది. కానీ కొంత మంది మాత్రం హనుమాన్ సినిమాను తక్కువ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది అసలు సినిమా? దీని వీఎఫ్ఎక్స్ గురించా? ఇంతలా అందరూ మాట్లాడుకున్నారు. టీవీ సీరియల్ రేంజ్ గ్రాఫిక్స్ పట్టుకుని చాలా లేపారు కదా? అంటూ భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలాంటి సినిమా అంత భారీ కలెక్షన్లు ఎలా వచ్చాయ్? అసలు చివరి 20 నిమిషాలంటూ లేకపోతే ఈ సినిమా బిలో యావరేజ్ కదా? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

హనుమాన్ సినిమా మీద మహేష్ బాబు ఫ్యాన్స్ కావాలనే ఇలా నెగెటివ్ ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి హనుమాన్ సినిమా ఓటీటీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూడగా ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ లోకి రానే వచ్చింది. అయితే ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చింది అని సంతోషపడే లోపే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు అభిమానులు.