Guntur Kaaram: పాటల పల్లకీలో గుంటూరు కారం, సెకండ్ సింగిల్ కు రెడీ

మూవీ విడుదలకు తక్కువ సమయమే ఉండటంతో టీం త్వరితగతిన షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Mahesh Guntur Kaaram

Mahesh Guntur Kaaram

Guntur Kaaram: ప్రస్తుతం “గుంటూరు కారం” చిత్రీకరణ జరుగుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ దర్శకుడు త్రివిక్రమ్ పాటల పిక్చరైజేషన్ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాడు. మహేష్ బాబు, మీనాక్షి చౌదరి నటించిన ఇటీవలి పాటను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో విస్తృతమైన సెట్‌తో చిత్రీకరించారు. మహేష్ బాబు, శ్రీలీలలతో కూడిన మరో పాట ఇంకా పూర్తి కాలేదు.

“గుంటూరు కారం” తారాగణంలో మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ఉన్నారు. ఈ చిత్రంలో శ్రీలీల మహేష్ బాబుతో రెండు యుగళగీతాలు ఉండగా మీనాక్షిది ఒకటి. అదనంగా ఒక కుటుంబ పాట ఉంది. ఈ వారంలోనే సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదలకు తక్కువ సమయమే ఉండటంతో టీం త్వరితగతిన షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో విడుదల కాబోయే రెండో పాట ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

Also Read: Flights Cancelled: ఏపీలో తుఫాన్ ఎఫెక్ట్, 23 విమానాలు రద్దు

  Last Updated: 05 Dec 2023, 01:00 PM IST