Tollywood: ఏనుగులకు స్నానం చేయిస్తున్న హీరోయిన్.. వీడియో వైరల్?

  • Written By:
  • Publish Date - March 27, 2024 / 05:11 PM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. దాంతో కొంతకాలం పాటు ఈమె సినిమాలకు దూరమైంది. ఇది ఇలా ఉంటే అదా శర్మ తాజాగా నటించిన చిత్రం ది కేరళ స్టోరీ. ఈ సినిమాతో అదా శర్మ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

ఇంతకముందు సినిమాలలో నటించినప్పటికీ రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో దక్కింది. ఈ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. అలా ఈ మూవీ కాంట్రవర్సీ కాస్త ఆమెకు బాగా కలిసి వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో అదా శర్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. హోలీ సంబరాల తర్వాతి రోజు రంగులను పోగొట్టేందుకు ఎంతో కష్టపడతామని పేర్కొంటూ ఏనుగుకు స్నానం చేయించింది. ఎంతో ఓపికగా పైపుతో, బకెట్ తో నీటిని తోడుడూ గజరాజుకు స్నానం చేయించింది.

ఆ తర్వాత ఒక భారీ తొట్టెలోకి వెళ్లి పీచుతో ఏనుగు శరీరాన్ని రుద్దుతూ శుభ్రం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్తా వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు హీరోయిన్ మంచి తనాన్ని, గొప్ప మనసును మెచ్చుకుంటున్నారు. చీరకట్టులో ఎంతో అందంగా కనిపించిన ఆమె ఏనుగుకు స్నానం చేయించడంతో ఆమె సింప్లిసిటీకి చాలామంది మెచ్చుకుంటున్నారు. కాగా ఈమె ది కేరళ స్టోరీ తో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నప్పటికీ ఈమెకు సరైన విధంగా అవకాశాలు మాత్రం రావడం లేదు..