ప్రజాగాయకుడు గద్దర్ పాడిన బానిసలారా లెండిరా అనే పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. నెటిజన్ల నుంచి ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గద్దర్ ఈ పాటను స్వయం రాసి…జనాల మనస్సులను తాకేలా పాడారు. ఈ పాటకు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా…సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీని సమకూర్చారు.
బొమ్మాకు మురళి నిర్మిస్తున్న సినిమా కోసం గద్దర్ ఈ పాటను పాడినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో సీనియర్ నటి సితార, రాజకీయనేత అద్దంకి దయాకర్ కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీకి ఇంకా పేరును ఖరారు చేయలేదు. బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Courtesy : v6