Kalyan Ram : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒక పక్క హీరోగా, మరో పక్క నిర్మాతగా వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ని హైదరాబాద్ లో వేసిన ఓ ప్రత్యేక సెట్ చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్ ని దాదాపు రూ.4 కోట్లతో నిర్మించారట.
మూవీలోని కీలక సన్నివేశాలు అయిన సీబీఐ సీన్స్ని.. చిత్ర యూనిట్ ఆ ప్రత్యేక సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా ఆ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందట. ఇప్పటికే ఆ సెట్ లో తొమ్మిది రోజుల షూటింగ్ ని పూర్తి చేసుకోగా.. చివరి రోజు ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమి కలగలేదు గాని, మొత్తం 4 కోట్ల సెట్ అంతా బూడిద అయ్యిపోయిందట. దీంతో నిర్మాతకు భారీగానే నష్టం కలిగింది. కాగా ఇప్పుడు ఆ చివరి రోజు షూటింగ్ కోసం.. మూవీ టీం ఏం చేయాలో తెలియక తికమకలో పడింది.
కాగా ఈ సినిమా దర్శకుడు ప్రదీప్ గతంలో ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా చేసారు. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోయినా మాస్ టేకింగ్ లో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాని కూడా పూర్తి మాస్ బొమ్మగా తీసుకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘అశోక క్రియేషన్స్’, ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.