Exclusive: అవెంజర్స్ ను తలదన్నేలా ‘కేజీఎఫ్-3’

అవెంజర్స్ లాంటి సినిమా ఇండియన్ స్క్రీన్‌పైకి వస్తే ఎలా ఉంటుంది? అద్భుతం కదా.. ఆ ఊహే గొప్పగా ఉంది.

  • Written By:
  • Updated On - June 11, 2022 / 12:56 PM IST

అవెంజర్స్ లాంటి సినిమా ఇండియన్ స్క్రీన్‌పైకి వస్తే ఎలా ఉంటుంది? అద్భుతం కదా.. ఆ ఊహే గొప్పగా ఉంది. ప్రతిష్టాత్మకమైన అలాంటి ప్రాజెక్టు మన దగ్గర వర్కవుట్ అవుతుందా? అంటే ఇదిగో నేనున్నా అంటూ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఆయన అదే పనిలో ఉన్నాడట. రాఖీభాయ్ తో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తే ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. ప్రశాంత్ నీల్ సాలార్ రెండు భాగాలు పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. దీని తర్వాత మాత్రమే KGF-3 ఉండబోతోంది.

ప్రశాంత్ నీల్ రాకీ భాయ్ (యష్), ప్రభాస్ సాలార్, ఎన్టీఆర్‌లను ఒకే మూవీ KGF-3గా తీసుకుని ఇండియన్ ఎవెంజర్స్‌ను రూపొందించే పనిలో ఉన్నాడని టాలీవుడ్ టాక్. ఈ విజువల్ వండర్‌ను రూపొందించడానికి విభిన్న ఫ్రాంచైజీలను ఒకటి చేయడం ద్వారా భారతీయ తెరపై ఇది అతిపెద్ద ఫీట్ కానుంది. అయితే ఈ ‘ఎక్స్‌పెండబుల్స్‌’ తరహా సినిమాకు హీరోలు ఓకే చెప్పాలి. స్టోరీ లైన్ చెక్కుచెదరకుండా గ్రిప్పింగ్‌గా ఉండాలి. అప్పుడే ముగ్గురు స్టార్స్ సినిమా చేయడానికి ముందుకొస్తారు. ఇప్పటికే కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 లాంటి పాన్ మూవీస్ తో సత్తా చాటిన ప్రశాంత్ నీల్ తలుచుకుంటే.. అవెంజర్స్ లాంటి పెద్ద ప్రాజెక్టు సాధ్యంకాక తప్పదు.