Chaari 111: వెన్నెల కిశోర్ కామెడీని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు : నిర్మాత అదితి సోనీ

  • Written By:
  • Updated On - February 27, 2024 / 11:58 PM IST

Chaari 111: ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటించిన సినిమా ‘చారి 111’. ‘మళ్ళీ మొదలైంది’ ఫేమ్ టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వంలో బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించారు. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా, మురళీ శర్మ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మార్చి 1న థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ… ”ఈ సినిమాలో ఒక్కటే పాట ఉంది. అది రాసే బాధ్యత నాకు అప్పగించారు. నన్ను నమ్మి దర్శక నిర్మాతలు వచ్చారు. సంగీత దర్శకుడికి మన భాష కాదు. దర్శకుడు కీర్తి యాడ్ ఫిలిమ్స్ నుంచి వచ్చారు.

ఈ పాట రాయడానికి మూడు నెలల సమయం తీసుకున్నా. వెంటనే రాయలేక కాదు… నన్ను నమ్మి రావడంతో అద్భుతంగా రాయాలని కృషి చేశా. సైమన్ కె కింగ్ మంచి బాణీ ఇచ్చారు. మంచి సాహిత్యం కుదిరింది. మార్చి 1న సినిమా విడుదల అవుతోంది. అందరూ వెళ్లి చూడాలని కోరుతున్నా. వెన్నెల కిశోర్ ప్రేక్షకులు అందరికీ ఇష్టమైన నటుడు. ఆయన తప్పకుండా నవ్విస్తారు” అని అన్నారు. దర్శకుడు టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ… ”నేను తెలుగు వాడిని. బెంగళూరులో పదేళ్లు యాడ్ ఫిలిమ్స్ చేసి సినిమాల్లోకి వచ్చా. ‘చారి 111’కి ముందు ‘మళ్ళీ మొదలైంది’ సినిమా చేశా. అందులో వెన్నెల కిశోర్ గారు కమెడియన్ రోల్ చేశారు. ఆయనకు అప్పుడే ఈ సినిమా కథ చెప్పా.

ఆయనకు నచ్చడంతో సినిమా స్టార్ట్ చేశాం. ఆయన ఫెంటాస్టిక్ కమెడియన్. ఆయనకు ఫ్యాన్ నేను. ఆయనకు టైలర్ మేడ్ క్యారెక్టర్ చారి. ఇదొక స్పై యాక్షన్ కామెడీ జానర్ ఫిల్మ్. కమర్షియల్ సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. నేను రామ జోగయ్య శాస్త్రి గారి సాహిత్యానికి పెద్ద ‘మళ్ళీ మొదలైంది’ సినిమాలో పాటలు రాయించుకోవాలని అనుకున్నా. కానీ, కుదరలేదు. ఈ సినిమాతో కుదిరింది. థీమ్ సాంగ్ అద్భుతంగా రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కె కింగ్, నేను బీటెక్ బ్యాచ్‌మేట్స్. కాలేజీలో చదుకోవడం తప్ప కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ చేశాం. మంచి మ్యూజిక్, రీ రికార్డింగ్ ఇచ్చాడు. సంయుక్తా విశ్వనాథన్ యాక్షన్ కూడా చేసింది. లాస్ట్ బట్ నా లీస్ట్… మా నిర్మాత అదితి గారు. ఆవిడ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తారు. కంటెంట్ రిచ్ సినిమాలు తీయాలని వచ్చారు