Bollywood: బాలీవుడ్ లో బెట్టింగ్ కలకలం, శ్రద్ధా కపూర్, కపిల్ శర్మకు ఐడీ నోటీసులు

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్, హాస్యనటుడు కపిల్ శర్మ, నటి హుమా ఖురేషీలకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు ​​పంపింది.

Published By: HashtagU Telugu Desk
Shraddha Kapoor Viral I Drink Kada To Beat The Flu. You All Go Watch My Movie Soon

Shraddha Kapoor Viral I Drink Kada To Beat The Flu. You All Go Watch My Movie Soon

Bollywood: బాలీవుడ్ లో బెట్టింగ్ యాప్ కలకలం రేపుతోంది. తాజాగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్, హాస్యనటుడు కపిల్ శర్మ, నటి హుమా ఖురేషీలకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు ​​పంపింది. ఈడీ సమన్లు ​​జారీ చేసిన బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఏజెన్సీ ముందు హాజరు కావడానికి కొంత సమయం కోరినట్లు సమాచారం. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద రణబీర్ కపూర్‌కు సమన్లు ​​జారీ చేసింది ED.

కాగా, ఇదే మహదేవ్ గేమింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటి శారదా కపూర్‌కు కూడా సమన్లు ​​అందాయి. శుక్రవారం ఈడీ ఎదుట హాజరుకావాలని శ్రద్ధా కపూర్‌ను కోరినట్లు సమాచారం. ఈరోజు శ్రద్ధా కపూర్ వారి ముందుకు వస్తారో లేదో తెలియదు.

ఇదే కేసుకు సంబంధించి హీనా ఖాన్‌కు కూడా ఏజెన్సీ సమన్లు ​​పంపినట్లు సోర్సెస్ చెబుతున్నాయి. “నటీనటులు మహాదేవ్ గేమింగ్ యాప్ గురించి తమకు తెలిసిన వాటిని మరియు దాని ప్రమోషన్‌లో వారు ఎలా పాలుపంచుకున్నారనే అనుమానాలున్నాయి. కపిల్ శర్మ, హుమా ఖురేషి కూడా ఏజెన్సీ ముందు హాజరు కావడానికి కొంత సమయం కావాలని కోరినట్లు కూడా తెలుస్తోంది.

Also Read:Pawan Kalyan: నేను ఎన్డీయేతో ఉన్నా: పవన్ కళ్యాణ్ క్లారిటీ!

  Last Updated: 06 Oct 2023, 12:53 PM IST