రివ‌ర్స్ కొట్టిన ర‌జినీపై వ‌ర్మ ట్వీట్‌..

మ‌రోసారి త‌లైవాపై వివాదాస్ప‌ద ట్వీట్ చేశాడు సెన్సేష‌న‌ల్ డైరక్ట‌ర్ వ‌ర్మ‌. అయితే, ఈ సారి అగి గట్టిగానే రివ‌ర్స్ ఫైర్ అయిన‌ట్టుంది. ఎందుకో అస‌లా ట్వీట్ ఏంటో చ‌ద‌వండి.

  • Written By:
  • Publish Date - October 26, 2021 / 03:08 PM IST

మాస్ అండ్ క్లాస్ ఆడియ‌న్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ ర‌జినీ కాంత్‌. అస‌లు ర‌జినీ అంటేనే స్ట‌యిల్ ఐకాన్‌. 70ల్లో కూడా యంగ్ హీరోల‌కు కాంపిటీష‌న్ ఇస్తూ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న హీరో. అంత‌ర్జాతీయంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్ర‌హీత‌పై లెక్క‌లేన‌న్ని జోక్స్‌, మీమ్స్ కూడా ఉన్నాయి. ర‌జినీకి వాచ్ అక్క‌ర్లేదు..టైమెంతో రజినీ డిసైడ్ చేస్తాడు. ఉల్లిపాయ‌ల‌ను కూడా ఏడిపించ‌గ‌ల స‌త్తా ఉన్న‌వాడు ర‌జినీ. ఇలా వేలాది జోక్స్ ర‌జినీపై వ‌స్తున్నా కూడా వాటిని ఎప్పుడూ సీరియ‌స్‌గా తీసుకోడు ర‌జినీ.

అయితే, ఎప్పుడూ అంద‌రినీ గిల్లుతూ ఉండే రామ్‌గోపాల్ వర్మ ఈ సారి ర‌జినీపై పెట్టిన ఓ ట్వీట్ అత‌న్ని కాస్త ఇబ్బందికి గురిచేసింద‌నే చెప్పాలి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న సంద‌ర్భంగా ఈ ట్వీట్ చేశాడు ర‌జినీ. వెంక‌య్య‌నాయుడు అవార్డ్ ఇస్తున్న ఫోటోను పెట్టి.. ఓ కొరియ‌ర్ మేన్ ద్వారా అవార్డు అందుకుంటున్న ర‌జినీ అని పోస్ట్ చేశాడు. అత్యుత్త‌మ‌మైన రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తిపై ఇలాంటి కామెంట్ చేయ‌డంపై ఆర్జీవిని ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు నెటిజ‌న్స్‌.

 

 

ర‌జినీని టార్గెట్ చేస్తూ వ‌ర్మ టీట్లు పెట్ట‌డం ఇది మొద‌టిసారి కాదు. 2020 క‌రోనా టైమ్‌లో క‌రోనాను ర‌జినీకాంత్ ఎందుకు చంప‌లేదు అంటూ ఓ వివాదాస్ప‌ద ట్వీట్ చేశాడు. దీనిపై కూడా అప్ప‌ట్లో ర‌జినీ ఫ్యాన్స్ వ‌ర్మ‌పై గరం అయ్యారు.

అయినా కూడా వ‌ర్మ ర‌జినీపై కామెంట్ చేస్తూనే ఉన్నాడు. అదే ఏడాది అక్టోబ‌ర్‌లో గ‌జినీకాంత్ అంటూ వ‌ర్మ చేసిన ట్వీట్ వివాద‌స్ప‌దం అయింది కూడా.

తాజాగా వ‌ర్మ చేసిన కామెంట్స్‌పై ర‌జినీ ఫ్యాన్స్‌తో స‌హా సామాన్యులు కూడా మండిప‌డుతున్నారు.అయితే, వెంక‌య్య‌నాయుడిని ఉద్దేశించి ట్వీట్ చేయ‌డం కానీ.. ఆయ‌న‌ను డీఫేమ్ చేసే ఉద్దేశం కానీ వ‌ర్మ‌కు లేదంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. మ‌రోవైపు వ‌ర్మ ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వివాదాస్ప‌ద ట్వీట్‌ని తొల‌గించ‌డం కానీ దానిపై వివ‌ర‌ణ ఇవ్వ‌డం కానీ చేయ‌లేదు.