Allu Arjun: అల్లు అర్జున్ మూవీ కోసం పారితోషికం వద్దన్న అట్లీ.. ఎందుకో తెలుసా?

  • Written By:
  • Publish Date - April 1, 2024 / 06:38 PM IST

తమిళ దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయనకు తమిళ ఇండస్ట్రీతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ తో తెరకెక్కించిన జవాన్ మూవితో బాలీవుడ్ లో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు అట్లీ. అలాగే దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన తొలి హిందీ సినిమా కూడా అదే. అట్లీ తన మొదటి బాలీవుడ్ ప్రాజెక్ట్‌ ను కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో చేశాడు. గత ఏడాది 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది జవాన్.

ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది. జవాన్ 1000కోట్ల వరకు వసూళ్లు సాదించింది. ఇక డైరెక్టర్ అట్లీతో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సైతం క్యూ కడుతున్నాయి. అలాగే అట్లీ రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. అయితే అట్లీ నెక్స్ట్ ఎవరితో సినిమా చేయనున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా అల్లు అర్జున్ తో అట్లీ సినిమా చేస్తున్నాడని టాక్. తాజాగా అట్లీ కి సంబందించిన ఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది.

అయితే అట్లీ బన్నీ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట రెమ్యునరేషన్ కు బదులు లాభాల్లో వాటా అడగాలని అట్లీ నిర్ణయించుకున్నట్లు టాక్. అల్లు అర్జున్ తో సినిమాకి పారితోషికం కాకుండా షేర్ అడుగుతున్నట్లు గాసిప్ స్ప్రెడ్ అవుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆగస్ట్ 15న సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత అట్లీతో సినిమా చేయనున్నాడు బన్నీ.