Priyanka Chopra: కరణ్ జోహార్ కారణంగానే ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ని విడిచిపెట్టిందా..?

నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ను విడిచిపెట్టి హాలీవుడ్‌లో పనిచేయడానికి బలవంతంగా కారణాన్ని మొదటిసారి ప్రస్తావించింది. బాలీవుడ్‌లో తనను పక్కన పెట్టారని, తనకు ఎవరూ పని ఇవ్వడం లేదని చెప్పింది. ప్రియాంక ఈ ప్రకటనపై కంగనా రనౌత్ స్పందన ఇప్పుడు తెరపైకి వచ్చింది.

  • Written By:
  • Publish Date - March 29, 2023 / 07:40 AM IST

నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ను విడిచిపెట్టి హాలీవుడ్‌లో పనిచేయడానికి బలవంతంగా కారణాన్ని మొదటిసారి ప్రస్తావించింది. బాలీవుడ్‌లో తనను పక్కన పెట్టారని, తనకు ఎవరూ పని ఇవ్వడం లేదని చెప్పింది. ప్రియాంక ఈ ప్రకటనపై కంగనా రనౌత్ స్పందన ఇప్పుడు తెరపైకి వచ్చింది. తాజాగా ప్రియాంక చేసిన ఆరోపణలపై తాజాగా ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. ప్రియాంకపై అనధికార నిషేధం విధించింది ఫిలిం మేకర్ కరణ్ జోహార్ అని చెప్పింది. కాగా.. ప్రియాంక, కంగనా 2008లో ‘ఫ్యాషన్’ అనే చిత్రంలో కలిసి పనిచేశారు.

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ను ఎందుకు విడిచిపెట్టిందన్న న్యూస్‌ ఆర్టికల్‌ను మంగళవారం రీట్వీట్ చేసిన కంగనా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘బాలీవుడ్ గురించి ప్రియాంకచోప్రా చెప్పాల్సింది ఇదే. బీటౌన్ గ్యాంగ్ ఆమెను బెదిరించి, బాలీవుడ్‌‌ను వదిలి వెళ్లేలా చేసింది. కరణ్ జోహారే ఆమెను నిషేధించాడని అందరికీ తెలుసు’ అని ట్వీట్‌లో పేర్కొంది. సినీ పరిశ్రమ సంస్కృతిని, వాతావరణాన్ని పాడు చేసినందుకు ఈర్ష్య, అసంబద్ధం, విషపూరితమైన వ్యక్తి బాధ్యత వహించాలని కంగనా రనౌత్ మరో ట్వీట్‌లో రాశారు.

Also Read: Naga Chaitanya: అడ్డంగా బుక్కైన నాగచైతన్య..ఆమెతో లండన్ హోటల్లో అలా…!

ఫ్యాషన్ చిత్రంలో ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ కలిసి పనిచేశారు. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రియాంక చోప్రా బాలీవుడ్, హాలీవుడ్ రెండింటిలోనూ పనిచేసిన ప్రసిద్ధ నటి. ఆమె వివిధ అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉంది 2019లో “ది స్కై ఈజ్ పింక్” తర్వాత ఆమె బాలీవుడ్ చిత్రంలో కనిపించలేదు.